లేడీ విల‌న్‌తో మ‌రోసారి వ‌ర్క‌వుట్ అవుతుందా?

  • IndiaGlitz, [Monday,May 14 2018]

13 ఏళ్ల త‌ర్వాత విశాల్ త‌న‌కు బ్రేక్ ఇచ్చిన సినిమా 'పందెం కోడి' (సండైకోళి)కి సీక్వెల్‌ను చేస్తున్నాడు. 'సండైకోళి2' పేరుతో త‌మిళంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. తెలుగు టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే పందెంకోడి 2 అని పెట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయి.

ఈ సినిమాలో మ‌రో హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తుంది. ఇది వ‌ర‌కు విశాల్ 'పొగ‌రు' సినిమాలో శ్రియారెడ్డి లేడీ విల‌న్‌గా న‌టించింది. ఇప్పుడు విశాల్ మ‌రోసారి లేడీ విల‌న్‌తో ఢీ కొట్ట‌బోతున్నాడు. మొద‌టి పార్ట్‌లో లాల్ విల‌న్‌గా న‌టించారు.

మ‌రి ఈ సీక్వెల్‌లో వ‌రల‌క్ష్మికి లాల్‌కి ఏమైనా రిలేష‌న్ ఉంటుందా? లేదా? అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. రీసెంట్‌గానే ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. విశాల్ 25వ చిత్ర‌మిది.

More News

తేజ కోసం బాల‌య్య ప్ర‌య‌త్నాలు...

దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు బ‌యోపిక్‌ను 'య‌న్‌.టి.ఆర్‌' పేరుతో తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ఉంది - శ్రీ దివ్య

'మనసా' చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన అచ్చ తెలుగు అమ్మాయి శ్రీదివ్య. తెలుగులో చేసిన సినిమాలు తక్కువే అయినా హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎ బి టి క్రియేషన్స్ వారి 'వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మీ' చిత్ర ప్రారంభోత్సవం...

ఎబిటి క్రియేషన్స్ పతాకంపై మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సమర్పణలో ఎం శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్ కె. రెడ్డి లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం " వేర్ ఈజ్ వెంకట లక్ష్మీ".

న్యూజెర్సీ ప్ర‌భుత్వం నుండి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న న‌ట‌కిరీటి డా.రాజేంద్ర ప్ర‌సాద్‌

41 సినీ ప్ర‌స్థానంలో న‌వ ర‌సాలున్న ఏ పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించ‌గ‌ల న‌టుడు న‌ట‌కిరీటి డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌. 237 సినిమాల్లో న‌టించిన ఈయ‌న ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో మెప్పించారు.

ర‌వితేజ‌కు కూతురు కావాల‌ట‌...

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్‌పై రెండు సినిమాలు రూపొందుతున్నాయి.