లారెన్స్ రాజీ ప‌డ‌తాడా?

  • IndiaGlitz, [Sunday,May 26 2019]

బాలీవుడ్ సినిమా 'లక్ష్మీబాంబ్‌' విష‌యంలో ద‌ర్శ‌కుడు రాఘ‌వ లారెన్స్‌, నిర్మాత‌ల‌కు మ‌ధ్య కాస్త వ్య‌వ‌హారం చెడింది. ద‌ర్శ‌కుడిగా త‌న‌కు గౌర‌వం ద‌క్క‌డం లేదంటూ లారెన్స్ బాలీవుడ్ ప్రాజెక్ట్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఇది సినిమా నిర్మాణంపై చాలా పెద్ద ప్ర‌భావాన్నే చూపింద‌ట‌. మ‌రో దర్శ‌కుడిని వెతకాల‌ని నిర్మాత‌లు ముందుగా భావించారు.

కానీ ఎందుక‌నో లారెన్స్‌తో మ‌రోసారి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి వారు సిద్ధ‌మ‌య్యారు. అందులో భాగంగా లారెన్స్‌, నిర్మాత‌లు మ‌ధ్య నేడు చెన్నైలో చ‌ర్చ‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఓ టెక్నీషియ‌న్‌గా త‌న‌కు గౌర‌వం ద‌క్కితేనే తాను 'ల‌క్ష్మీబాంబ్' సినిమా చేస్తాన‌ని లారెన్స్ తెలిపారు. మ‌రి లారెన్స్‌తో నిర్మాత‌లు జ‌ర‌ప‌బోయే చ‌ర్చ‌లు స‌క్సెస్ కావాల‌ని కోరుకుందాం.