కొత్త జోన‌ర్‌కు చైతు ఓకే అంటాడా?

  • IndiaGlitz, [Monday,September 21 2020]

టాలీవుడ్ ట్రెండ్ ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కాకుండా డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీస్‌లో న‌టించ‌డానికి స్టార్స్‌, అలాంటి సినిమాల‌ను చూడ‌టానికి ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపుతుండ‌టంతో మేక‌ర్స్ డిఫ‌రెంట్ స‌బ్జెక్ట్స్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అక్కినేని క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య కోసం ఓ ద‌ర్శ‌కుడు స్పోర్ట్స్ డ్రామాతో క‌థ‌ను సిద్ధం చేస్తున్నాడ‌ట‌. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు.. వెంకీ అట్లూరి. రంగ్‌దే సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి అవుతుంది. త్వ‌ర‌లోనే సినిమా ఓటీటీలో విడుద‌ల‌య్యే అవ‌కాశాలున్నాయి. ఈ త‌రుణంలో వెంకీ అట్లూరి త‌దుప‌రి సినిమాకు సంబంధించిన ప్లాట్‌ను సిద్ధం చేసుకున్నాట్ట‌. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆ సినిమా ప్లాట్‌ను నాగ‌చైత‌న్య‌కు వినిపిస్తే.. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుర‌మ్మ‌న్నాడ‌ని, ఇప్పుడు వెంకీ అట్లూరి అదేప‌నిలో బిజీగా ఉన్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం ల‌వ్‌స్టోరి చిత్రాన్ని పూర్తి చేస్తున్న చైత‌న్య త‌దుప‌రి విక్ర‌మ్ కుమార్ దర్శ‌క‌త్వంలో థాంక్యూ సినిమా చేయ‌బోతున్నాడు. వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో ఈ సినిమా పూర్త‌య్యితే, త‌దుప‌రి సినిమాను మోహ‌నకృష్ణ ఇంద్ర‌గంటి, నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎవ‌రితో అయినా చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్ వినిపించింది. కాగా.. ఇప్పుడు ఈ లిస్టులో వెంకీ అట్లూరి కూడా చేరాడు. మ‌రి ఈ ముగ్గురిలో చైతు ఎవ‌రితో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడో చూడాలి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ అంటే చైత‌న్య‌కు కూడా కొత్త జోన‌ర్ అనే చెప్పాలి.

More News

సంతకం పెట్టకుంటే తిరుమల అపవిత్రమవుతుందా?: కొడాలి నాని షాకింగ్ కామెంట్స్

తిరుమలలో డిక్లరేషన్‌పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

త‌మ‌న్నాకి ఏమైంది..?

మిల్కీబ్యూటీ త‌మ‌న్నాకు ఏమైంద‌ని ఆమె అభిమానులు అనుకుంటున్నారు.

ఎవ్వరి ఊహకు అందని ట్విస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్..

ఒక లైలా కోసం సాంగ్‌తో నాగ్ ఎంట్రీ ఇచ్చారు. సెల్ఫ్ నామినేట్ అవడం కరెక్ట్ కాదని నాగ్ మరోసారి కరాటే కల్యాణికి సూచించారు.

మధుమిత ఓ ఛానల్ లైవ్‌లో ఉండగా.. షాకింగ్ విషయం చెప్పిన టీచర్..

ఆన్‌లైన్ క్లాసుల పేరిట ప్రైవేటు పాఠశాలలు భారీగా ఫీజులు వసూలు చేయడంపై ఇటీవల నటుడు శివబాలాజీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన విషయం తెలిసిందే.

దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది: పాయల్‌పై అనురాగ్ కశ్యప్ ఫైర్

హీరోయిన్ పాయల్ ఘోష్.. దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై చేసిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.