ఆ విషయంలో ప్రభాస్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేస్తాడా?

  • IndiaGlitz, [Friday,September 11 2020]

ఇంకా ప్రభాస్‌ 'ఆదిపురుష్‌' సినిమా ప్రారంభం కానే లేదు. కానీ అప్పుడే రికార్డుల గురించి మాట్లాడుకోవడం మొదలెట్టేశారు. ఇంతకూ ఆదిపురుష్‌ ఏ విషయంలో రికార్డ్‌ క్రియేట్‌ చేయనుందనే వివరాల్లోకెళ్తే.. బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్‌ రాముడుగా నటిస్తోన్న పౌరాణిక చిత్రం 'ఆదిపురుష్'‌(రామాయణం). త్రీడీ టెక్నాలజీతో తెలుగు, హిందీల్లో రూపొందించి దాన్ని మిగిలిన భాషల్లో అనువాదం చేసి విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 'రాధేశ్యామ్‌' సినిమా పూర్తి చేయగానే ప్రభాస్‌ తన నెక్ట్స్‌ మూవీగా నాగ్‌ అశ్విన్‌ మూవీని స్టార్ట్‌ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అలా చేయడం లేదట. ఆ సినిమా కంటే ముందుగానే 'ఆదిపురుష్‌' సినిమాను ప్రభాస్‌ షురూ చేస్తాడట. ఈ సినిమా షూటింగ్‌ను ఎక్కువగా గ్రీన్‌ మ్యాట్‌, స్టూడియోలోనే చిత్రీకరించేలా ప్లాన్‌ చేస్తున్నారట ఓంరౌత్‌.

ఇప్పటివరకు రాజమౌళి డైరెక్ట్‌ చేసిన బాహుబలి చిత్రంలో నలబై ఐదు వేల వి.ఎఫ్‌.ఎక్స్‌ షాట్స్‌ను ఉపయోగించారట. ఇప్పుడు ఓంరౌత్‌ రియల్‌ లొకేషన్స్ కంటే గ్రీన్‌ మ్యాట్‌లోనే ఎక్కవ షూటింగ్‌ చేయడం వల్ల వి.ఎఫ్‌.ఎక్స్‌పైనే ఆధారపడాల్సి వస్తుందట. దీని కారణంగా బాహుబలిని మించే వి.ఎఫ్‌.ఎక్స్‌ షాట్స్‌ను ఆదిపురుష్‌లో ఉపయోగిస్తారట. ఈ సినిమా కోసం ఇప్పటికే ప్రభాస్‌ విలువిద్యను ప్రాక్టీస్‌ చేస్తున్నాడట. ఇందులో రావణుడుగా సైఫ్‌ అలీఖాన్‌ నటింబోతున్నారు.

More News

రియాకు మరో షాక్...

బాలీవుడ్ సుశాంత్ రాజ్‌పుత్ ప్రియురాలికి మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆమె డ్రగ్స్ కేసులో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్ట్ అయి రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

న్యూలుక్‌తో సర్‌ప్రైజ్ చేసిన చిరు..

లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తూ వస్తున్నారు. ఒకసారి చేపలకూర చేసి మెప్పిస్తే..

ఏపీలో కరోనా.. షాకింగ్ విషయాలు చెప్పిన 'సీరో' సర్వే..

కరోనా టెస్టులు అత్యధికంగా చేస్తున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి.. ఇప్పటికే ఐదు లక్షలకు పై చిలుకు కేసులు ఏపీలో నమోదయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో చూపుతున్న బోగస్ లెక్కలు కూడా ఏపీలో చూపించట్లేదు.

బిగ్‌బాస్4: సస్పెన్స్‌లో పెట్టాల్సింది ఎవరిని? ఏంటీ కట్టప్ప గోల?

బిగ్‌బాస్ క్యాజువల్‌గానే ఇవాళ కూడా బోర్ కొట్టించింది. నిజానికి.. గత మూడు రోజులతో పోలిస్తే ఇవాళ మరింత బోర్ కొట్టించింది. దివి కంటెస్టెంట్లు అందరి గురించి తను వ్యూని వివరించడంతో షో స్టార్ట్ అయింది.

నటి శ్రావణి కేసు: దేవరాజు ఒక ప్లేబాయ్‌గా గుర్తించిన పోలీసులు

బుల్లితెర నటి శ్రావణి సూసైడ్ కేసు డైలీ సీరియల్‌ను మించిన మలుపులు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి గంటకో కొత్త పేరు వెలుగు చూస్తోంది.