రాజ్ త‌రుణ్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా?

  • IndiaGlitz, [Wednesday,April 13 2016]

త‌క్కువ కాలంలోనే మంచి గుర్తింపుని సంపాదించుకున్న యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్‌. హ్యాట్రిక్ విజ‌యాల త‌రువాత ప‌రాజ‌యం ప‌ల‌క‌రించినా.. అత‌ని తాజా చిత్రం 'ఈడో ర‌కం ఆడో ర‌కం'పై మంచి అంచ‌నాలే ఉన్నాయి. మంచు విష్ణుతో క‌లిసి రాజ్ త‌రుణ్ చేసిన ఈ సినిమా ఈ నెల 14న విడుద‌ల కానుంది. ఈ తేదికి సినిమాని విడుద‌ల చేయాల‌నుకోవ‌డం సాహ‌స‌మే. ఎందుకంటే.. స‌ర్దార్‌, స‌రైనోడు వంటి పెద్ద రెండు చిత్రాల మ‌ధ్య ఖాళీ దొరికిన వారంలో ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నారు మ‌రి.

విశేష‌మేమిటంటే.. రాజ్ త‌రుణ్ రెండో చిత్రం 'సినిమా చూపిస్తా మావ' కూడా ఇలాగే రెండు పెద్ద సినిమాల మ‌ధ్య దొరికిన గ్యాప్‌లో రిలీజై హిట్ అవ్వ‌డం. గ‌తేడాది ఆగ‌స్ట్ 7న 'శ్రీ‌మంతుడు', ఆగ‌స్టు 21న 'కిక్ 2' రిలీజైతే.. వాటి మ‌ధ్య గ్యాప్‌లో ఆగ‌స్టు 14న 'సినిమా చూపిస్తా మావ' విడుద‌లై విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో అదే 14 మ్యాజిక్ త‌రుణ్ రిపీట్ చేస్తాడో లేదో చూడాలంటున్నారు ప‌రిశీల‌కులు.

More News

పవ‌న్ ని అలా చూడ‌గ‌ల‌రా?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎవ‌రికైనా ఠ‌క్కున‌ గుర్తుకొచ్చే చిత్రాలు.. సుస్వాగతం, తొలి ప్రేమ‌, త‌మ్ముడు, బద్రి, ఖుషి. ఈ ఐదు సినిమాలూ అత‌ని కెరీర్ ద‌శ‌ని, దిశ‌ని మార్చేసాయి. ఈ సినిమాల‌న్నింటిలోనూ ఉన్న కామ‌న్ పాయింట్‌.. ప్రేమ‌క‌థ‌లు కావ‌డం.

శ్రుతిది మ‌ళ్లీ అదే తంతు

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది శ్రుతి హాస‌న్‌. 'ఎవ‌డు', 'రేసు గుర్రం', 'శ్రీమంతుడు'.. ఇలా పెద్ద హీరోల‌తో శ్రుతి హీరోయిన్‌గా చేసిన మూడు వ‌రుస సినిమాలు ఆమెకు విజ‌యాన్ని అందించాయి.

రైట‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ఎన్టీఆర్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్...కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

అ ఆ టీజ‌ర్ రిలీజ్..

నితిన్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తెర‌కెక్కిస్తున్న చిత్రం అ ఆ. అన‌సూయ రామ‌లింగం వెర్షెస్ ఆనంద‌విహారి అనేది ట్యాగ్ లైన్.  ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

నాగశౌర్య అవుట్...

ప్రస్తుతం యంగ్ హీరోస్ లో నాగశౌర్యకు మంచి క్రేజ్ ఉంది. అయితే నాగశౌర్య ఆ క్రేజ్ ను సక్సెస్ రూపంలో మలుచుకోలేకపోతున్నాడు. రీసెంట్ గా నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కళ్యాణ వైభోగమే సినిమా మంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంది.