రామ్ కి మరోసారి కలిసొస్తుందా?

  • IndiaGlitz, [Saturday,September 09 2017]

కందిరీగ త‌రువాత స‌రైన విజ‌యం లేని యువ క‌థానాయ‌కుడు రామ్‌కి ఊర‌ట‌నిచ్చిన చిత్రం నేను శైల‌జ‌. గ‌తేడాది జ‌న‌వ‌రి 1న వ‌చ్చిన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఆ చిత్రం త‌రువాత హైప‌ర్ చేస్తే.. ఆశించిన ఫ‌లితం రాలేదు. దీంతో మ‌ళ్లీ అదే నేను శైల‌జ డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల‌తో మ‌రో సినిమా చేస్తున్నాడు రామ్‌. ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రామ్ లుక్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంద‌ని సినిమాలో రామ్ లుక్‌ను చూసిన వాళ్లంద‌రూ అంటున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

రామ్‌, కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఈ రెండు చిత్రాల‌కు దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించాడు. అంతేకాకుండా.. ఆ చిత్రంలో కేర‌ళ కుట్టి కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తే.. తాజా చిత్రంలో మ‌రో మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఓ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మ‌రి ఈ కేర‌ళ కుట్టిల‌ సెంటిమెంట్ కూడా రామ్‌కి మ‌రోసారి క‌లిసొస్తుందా? వెయిట్ అండ్ సీ!

More News

తమన్నా మళ్లీ బిజీ

శ్రీ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తమన్నాకు,హ్యాపీడేస్ తో హీరోయిన్ గా బ్రేక్ వచ్చింది.

సెప్టెంబర్ 15న శింబు, నయనతార 'సరసుడు' రిలీజ్

యంగ్ ఛార్మింగ్ హీరో శింబు,అందాల తారలు నయనతార,ఆండ్రియా,ఆదాశర్మ క్రేజీ కాంబినేషన్ లో 'ప్రేమసాగరం'టి.రాజేందర్ సమర్పణలో

పాపం..లావణ్య

అందాల రాక్షసితో హీరోయిన్ గా పరిచయమైన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా

మెగా హీరోకి విలన్ గా దాసరి అరుణ్ కుమార్?

1998లో విడుదలైన 'గ్రీకువీరుడు' చిత్రంతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు దర్శకరత్న దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ కుమార్.

2017 సంవత్సరానికి గాను ఆలిండియా డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళికి ఎ.ఎన్.ఆర్ జాతీయ అవార్డ్

మహా నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరిట నెలకొల్పిన ఎ.ఎన్.ఆర్.జాతీయ అవార్డ్స్ ని గత కొంతకాలంగా నటీనటులు,