మాట నిలబెట్టుకోకుంటే నిజామాబాద్ ఎంపీగా రాజీనామా

  • IndiaGlitz, [Saturday,May 25 2019]

తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీచేసిన ధర్మపురి అరవింద్ కనివినీ ఎరుగని రీతిలో సుమారు 67వేలకు పై చిలుకు మెజార్టీతో గెలిచారు. ఇక్కడి రైతులు తమ సమస్యలు పరిష్కరించలేదని.. కవితపై తిరుగుబాటు చేస్తూ.. ఎక్కువ మంది రైతులు నామినేషన్స్ వేయడం.. కూడా అరవింద్‌కు కలిసొచ్చింది. అంతేకాదు.. రైతులకు పసుపు బోర్డు ఏర్పాటు చేసి తీరుతానని గట్టిగా హామీ ఇచ్చారు. దీంతో తమ సమస్యలు అరవింద్ అయితే పరిష్కరిస్తారని నమ్మిన రైతులు ఆయనకే పట్టం కట్టారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ‌పరోక్షంగా ఫుల్ సపోర్ట్ చేయడంతో ఫలితాలు తారుమారయ్యాయి.

ఫలితాల అనంతరం అరవింద్ రైతులకు ఓ ప్రామిసరీ నోట్ విడుదల చేశారు. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని.. అలా జరగని పక్షంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేసి రైతు/ ప్రజా ఉద్యమంలో పాల్గొంటానని ప్రకటించారు. కాగా.. రైతులకు పసుపు బోర్డ్, పసుపు, ఎర్ర జొన్నకు మద్దతు ధర కోసం రైతులు ఎప్పట్నుంచో నిజామాబాద్ వ్యాప్తంగా ఉద్యమిస్తున్నారే ఉన్నారు. సో.. ఈ రైతులకు అరవింద్ ఏ మాత్రం న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందే మరి.

కాగా.. అరవింద్ తండ్రి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్‌ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. మరోవైపు కుమారుడు బీజేపీ తరఫున పోటీచేసి విజయ డంఖా మోగించడం అరుదైన ఘటన అనే చెప్పుకోవచ్చు.

More News

చంద్రబాబుకు ఆర్జీవీ బస్తీమే సవాల్.. జై జగన్!

టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సవాల్ విసిరారు.

'కౌసల్య కృష్ణమూర్తి' ది క్రికెటర్‌ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల

నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెం.47గా

లగడపాటి రాజకీయమే కాదు.. ఇక పై సర్వే సన్యాసం కూడా!!

తెలంగాణ జరిగిన ముందస్తు ఎన్నికలు.. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ చేసిన ‘ఆర్జీప్లాష్’ టీమ్ సర్వే అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.

సెన్సార్ పూర్తి చెసుకున్న "సువ‌ర్ణ‌సుంద‌రి" 

జ‌య‌ప్ర‌ద‌,  పూర్ణ,  సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం “సువర్ణసుందరి“.   సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా దర్శకుడు సూర్య ఎమ్.ఎస్.ఎన్ తెరమీదకు తీసుకువస్తున్నారు.

సుడిగాలి సుధీర్‌ హీరోగా 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌' చిత్రం

జబర్దస్త్, ఢీ, పోవే పోరా వంటి సూపర్ హిట్ టెలివిజన్ షోస్ ద్వారా  ఎంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్‌హీరోగా,'రాజు గారి గది' ఫేమ్‌ ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా