గేటు మార్చిన రేవంత్.. ఈసారి గెలుపు ఖాయమేనా!?
Send us your feedback to audioarticles@vaarta.com
టైటిల్ చూడగానే గేటు మార్చడమేంటి..? అని ఆశ్చర్యమనిపిస్తోంది కదూ... అవును మీరు వింటున్నది నిజమే. రాజకీయ నాయకులకు ఉండే సెంటిమెంట్స్ అన్నీ ఇన్నీ కావు. ఐదేళ్లకోసారి వచ్చే ఎన్నికల ప్రచారం మొదలుకుని.. తిరిగి ఎన్నికలొచ్చి నామినేషన్ వేసే వరకు ప్రతి ఒక్కటీ సరైన సమయంలో చేస్తూనే ఉంటారు. అయితే తెలంగాణకు చెందిన కీలకనేత రేవంత్ రెడ్డికి వాస్తు అస్సలు కలిసిరాలేదట. అందుకు తన ఇంటికి కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన నాటి నుంచి రేవంత్గా ఏ విషయంలోనూ పెద్దగా కలిసిరావట్లేదనే విషయం జగమెరిగిన సత్యమే. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోవడం దాంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవడం.. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కలలో కూడా ఊహించని రీతిలో ఓటమిపాలవ్వడం ఇలా అన్నీ వరుస షాక్లే తగులుతున్నాయి. అంతేకాదు పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ తరఫున రేవంత్ బరిలోకి దిగారు.
అయితే వరుస ఇబ్బందులు రావడంతో దీంతో అసలు లోపం ఎక్కడుందా నిశితంగా కొన్ని రోజుల పాటు ఆలోచించిన రేవంత్... పరిష్కారం కనిపెట్టారట. ఇందుకు ఏకైక కారణం తన ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడమేనట. దీంతో పలువురు ప్రముఖు పండితులను మూడో కంటికి తెలియకుండా హైదరాబాద్.. జూబ్లిహిల్స్లోని తన ఇంటికి పిలిపించిన రేవంత్.. ఇళ్లంతా తిప్పి చూపించి వాస్తు దోషాలను గుర్తించాలని కోరారట.
దీంతో రంగంలోకి దిగిన పండితులు ఇంటి గేటు మొదలుకుని ఆయన ఇంటిపై ఫ్లోర్ వరకు నిశితంగా పరిశీలించారట. ఇంటి నుంచి రాకపోకలన్నీ జరిగే గేటు సక్రమంగా.. సరియైన వాస్తు లేదని పండితులు చెప్పగా ఆలస్యం చేయకుండా రేవంత్ చకచకా తూర్పుకు మార్పించేశారట. అంటే ఇక ఇంటి దోషాలన్నీ తొలిగిపోయాయన్న మాట.
కాగా.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం సుదర్శన యాగం చేపట్టిన రేవంత్.. తాజాగా వాస్తు దోషాలు కూడా క్లియర్ చేయించుకున్నారట. అయితే ఈ మార్పులు- చేర్పులు, దోషాలన్నీ తొలిగాయ్ కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి ఎంత వరకు లైన్ క్లియర్ అవుతుందో తెలియాలంటే మే-23 వరకు వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.