బెల్లంకొండ‌కు ఆమె ఓకే చెబుతుందా..?

  • IndiaGlitz, [Sunday,January 03 2021]

టాలీవుడ్ యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఖరారైంది. తెలుగులో స్టార్ హీరో ప్ర‌భాస్‌ను మాస్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర చేసిన మూవీ ‘ఛ‌త్ర‌ప‌తి’ని బాలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. శ్రీనివాస్‌ను తెలుగు ప్రేక్ష‌కులకు ‘అల్లుడు శీను’ సినిమాతో ప‌రిచ‌యం చేసిన డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్‌.. బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారు. ఈ విషయాలపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. వినాయ‌క్‌కు కూడా ఇదే బాలీవుడ్ డెబ్యూ మూవీ. ద‌ర్శ‌కధీరుడు తెర‌కెక్కించిన ఛ‌త్ర‌ప‌తి సినిమాను వినాయ‌క్ ఎలా ప్రెజంట్ చేస్తాడ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై జ‌యంతి లాల్ గ‌డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌ర‌నే దానిపై ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. అదేంటంటే.. శ్రీదేవి త‌న‌య జాన్వీక‌పూర్‌ను హీరోయిన్‌గా న‌టించ‌మ‌ని అడుగుతున్నారట‌. అయితే తెలుగులో పెద్ద స్టార్స్ సినిమాలకే తెలుగులో ఓకే చెప్ప‌ని జాన్వీక‌పూర్‌.. బెల్లంకొండ శ్రీనివాస్ ఛ‌త్ర‌ప‌తికి ఓకే చెబుతుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. అలాగే ఈ సినిమాలో అమ్మ పాత్ర‌లో ఢిల్లీ క్రైమ్ ఫేమ్‌ షెఫాలీ షా పోషించ‌నున్నార‌ట‌. మ‌ద‌ర్ సెంటిమెంట్ ప్ర‌ధాన పాయింట్‌గా స‌ముద్ర తీర ప్రాంతంలో దందా చేసే ఓ మాఫియా చేతిలో చిక్కుకున్న యువ‌కుడు డాన్ రేంజ్‌కు ఎలా ఎదిగాడు.. ఆ క్ర‌మంలో దూర‌మైన త‌న త‌ల్లి ప్రేమ‌ను ఎలా ద‌క్కించుకున్నాడ‌నే క‌థాంశ‌మే ఇది.

More News

మెగాస్టార్ రెడీ.. ‘లూసిఫ‌ర్‌’కు డేట్ ఖ‌రారు..!

మోహ‌న్‌లాల్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘లూసిఫ‌ర్‌’ను చిరంజీవి రీమేక్ చేయాల‌ని అనుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

డేట్ ఫిక్స్ చేసుకున్న ‘పుష్ప’‌.. 

ఈ ఏడాది 'అల వైకుంఠపురములో' సినిమాతో నాన్‌ 'బాహుబలి' రికార్డులు క్రియేట్‌ చేసిన బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో

యూపీలో ఘోర ప్రమాదం.. భవనం పైకప్పు కూలి 18 మంది మృతి

ఉత్తరప్రదేశ్ ఘాజియాబాద్‌ మురాద్‌నగర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

'సైకో వర్మ' సాంగ్ విడుదల

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ పై వస్తున్న మరో చిత్రం "సైకో వర్మ"  వీడు తేడా..టాగ్ లైన్ .

అందుకు మెగా ఫ్యాన్స్  ఒప్పుకుంటారా..?

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రంగా మ‌ల‌యాళ చిత్రం ‘లూసిఫ‌ర్’ రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే.