CM Jagan:విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తా.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

  • IndiaGlitz, [Tuesday,March 05 2024]

విశాఖ రాజధానిపై సీఎం జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తలతో వైజాగ్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వహించిన'విజన్ విశాఖ' సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి విశాఖలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు. అలాగే ఇక్కడి నుంచే పాలన చేస్తానని.. అదే తన కమిట్‌మెంట్ అని పేర్కొన్నారు. అలాగే అమరావతికి తాను వ్యతిరేకం కాదని.. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్ల రూపాయలు కావాలన్నారు. కానీ వైజాగ్‌ అయితే ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిందని తక్కువ ఖర్చుతో డెవలెప్ చేయవచ్చని స్పష్టంచేశారు.

అందుకే లేజిస్లేటివ్ క్యాపిటల్‌గా అమరావతి కొనసాగిస్తామని వివరించారు. సీఎం వైజాగ్ నుంచి పాలిస్తామంటే కొంతమంది నాయకులు కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డుపడుతున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని అవుతుందని ముందే తెలిసి వేల ఎకరాలు భూములు కొన్నారని ఆరోపించారు. విశాఖ రాజధాని అయితే అక్కడ వారి భూముల రేట్లు పడిపోతాయని కుట్రలకు తెరలేపారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైజాగ్ నుంచి పాలన చేయడం ఖాయమన్నారు. వచ్చే పదేళ్లలో విశాఖను ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మిస్తామని జగన్ వెల్లడించారు.

దేశంలోని మిగతా నగరాలతో పోల్చుకుంటే వైజాగ్‌ చాలా త్వరగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. రాష్ట్రానికి విశాఖ చాలా ముఖ్యమైన బ్యాక్ బోన్‌గా ఉండబోతోందని అన్నారు.
భవిష్యత్‌లో హైదరాబాద్‌ కంటే వైజాగ్ అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. విభజనలో భాగంగా హైదరాబాద్ కోల్పోయామని దాని ప్రభావం నేటికీ ఉంటోందన్నారు. ఓవైపు అభివృద్ధిని కొనసాగిస్తూనే ముఖ్యమైన వ్యవసాయ రంగాన్ని కూడా ఉరకలు పెట్టిస్తున్నామన్నారు. ప్రస్తుతం వ్యవసాయం ఏపీలో 70 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. రాష్ట్రంలో స్థిరత్వమైన ప్రభుత్వం ఉందని అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు.

చాలా రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ మెరుగైన స్థానంలో ఉందన్నారు. విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్‌లా మారుస్తామని.. విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. ఈ నగరాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ తెలిపారు. బెంగళూరు కంటే వైజాగ్‌లో మెరుగైన సదుపాయాలు ఉన్నాయని.. సముద్ర తీరంలో పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇందులో రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు కీలకమని తెలియజేశారు. ఈ సందర్భంగా వైజాగ్‌లో నిర్మించబోతున్న సచివాలయం నమూనాను ఆయన విడుదల చేశారు.

More News

Gummanur:వైసీపీకి మరో బిగ్ షాక్.. మంత్రి గుమ్మనూరు రాజీనామా..

వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడగా.. ఇప్పుడు ఏకంగా మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి రాజీనామా చేశారు.

Chandrababu:తనపై నమోదుచేసిన కేసుల వివరాలు ఇవ్వండి.. డీజీపీకి చంద్రబాబు లేఖ..

మరో వారం రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.

12th Fail:తెలుగులోనూ '12th ఫెయిల్' స్ట్రీమింగ్.. ఏ ఓటీటీలో అంటే..?

ఇటీవల హిందీలో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం '12th ఫెయిల్'. ప్రముఖ IPS ఆఫీసర్ మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా

Nihar Kapoor:జయసుధ వారసుడు.. 'రికార్డ్ బ్రేక్' హీరో నిహార్ కపూర్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..

అలనాటి హీరోయిన్ జయసుధ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన నిహార్ కపూర’ హీరోగా 'రికార్డ్ బ్రేక్' అనే సినిమాలో నటించారు. చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో

Chandrababu:వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

వాలంటీర్లు వైసీపీ కోసం మాత్రం పనిచేయవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. అనంతపురం జిల్లా పెనుకొండలో నిర్వహించిన 'రా కదలిరా' సభలో చంద్రబాబు పాల్గొన్నారు.