నెంబర్ మారుతుందా?
- IndiaGlitz, [Saturday,April 20 2019]
అల్లు అర్జున్ ఇప్పుడు ఇద్దరు దర్శకులతో హ్యాట్రిక్ సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకరు త్రివిక్రమ్. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఈ నెల 24 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఇక మరో దర్శకుడు సుకుమార్. ఆర్యతో అల్లు అర్జున్ని స్టార్ చేసిన సుకుమార్ తర్వాత ఆర్య 2 సినిమా చేశాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. సుకుమార్తో కూడా బన్ని హ్యాట్రిక్ మూవీ ఇది.
ఇది బన్ని 20వ సినిమా. కాగా.. దీని తర్వాత దిల్రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం దర్శకుడి బన్ని 21వ సినిమాగా 'ఐకాన్ కనపడుటలేదు' తెరకెక్కతుందని వార్తలు వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ నెంబర్ ఆర్డర్ మారునుందనే వార్తలు వినపడుతున్నాయి. ఎందుకంటే సుకుమార్ తన స్క్రిప్ట్ను ఇంకా రెడీ చేయలేదు. సమయం బాగానే పట్టేలా ఉందంటున్నారు. మరో పక్క వేణు శ్రీరాం బౌండెడ్ స్క్రిప్ట్తో సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి.. బన్ని త్రివిక్రమ్ తర్వాత వేణు శ్రీరాం సినిమా చేయాలనుకుంటున్నాడని వార్తలు వినపడుతున్నాయి. మరి దీనిపై బన్ని టీం ఎలా స్పందిస్తుందో చూడాలి.