మొద‌టి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న వింగ్స్ మూవీ మేక‌ర్స్ చిత్రం

  • IndiaGlitz, [Thursday,September 28 2017]

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా వింగ్స్ మూవీ మేక‌ర్స్ బేన‌ర్‌పై ఇటీవ‌ల కొత్త చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఎం.పూర్ణానంద్‌ దర్శకుడు. ప్రతిమ.జి నిర్మాత. ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. షూటింగ్‌లో భాగంగా ఈ సినిమా మొద‌టి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా...

దర్శకుడు ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ - ''ఇదొక ప్రేమకథా చిత్రమ్‌ అయితే ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఇది సోషియో ఫాంటసీ ప్రేమకథాచిత్రమ్‌. ఫ్రెష్‌లుక్‌తో ఉంటుంది. సినిమా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో మొద‌టి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఒక సాంగ్ స‌హా కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించాం. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. త్వ‌ర‌లోనే సెకండ్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నాం. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం. కార్తీక‌రాజు, మిస్తి చ‌క్ర‌వ‌ర్తిల మ‌ధ్య కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంటుంది'' అన్నారు.

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి, నాగినీడు, పృథ్వీరాజ్‌, జెమినిసురేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, మాటలు: ప్రదీప్‌ ఆచార్య, పూర్ణానంద్‌.ఎం, ఆర్ట్‌: రామకృష్ణ, నిర్మాత: ప్రతిమ.జి, కథ, కథనం, దర్శకత్వం: పూర్ణానంద్‌.ఎం.

More News

నేను కిడ్నాప్ అయ్యాను అక్టోబర్ 6 విడుదల

మధురం మూవీ క్రియేషన్స్ పతాకంపై, కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో  దగ్గుబాటి  వరుణ్ సమర్పణలో  మాధవి అద్దంకి నిర్మిస్తున్న చిత్రం 'నేను కిడ్నాప్ అయ్యాను'. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని   క్లీన్ 'యూ' సర్టిఫికెట్ సంపాదించుకుంది .

సూపర్ స్టార్ మహేష్ 'స్పైడర్'కి సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రశంసలు

సూపర్ స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఠాగూర్మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ ఎల్ పి, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై ఎన్.ప్రసాద్ నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ 'స్పైడర్'.

రెగ్యులర్ షూటింగ్ లో సాయిధరమ్ తేజ్- వి.వి.వినాయక్ చిత్రం

సుప్రీమ్ హీరో సాయిధరమ్తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ సెప్టెంబర్ 22న హైదరాబాద్లో ప్రారంభమైంది.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కి బ్రేక్ నిచ్చిన 'ఆనందం'కి 16 ఏళ్లు

ప్రస్తుతం తెలుగులో నెం.1 మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు యువ సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్. 1999లో విడుదలైన దేవి చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమైన దేవిశ్రీకి ...

రామ్ చరణ్ నటనకి పదేళ్లు

మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా తెరంగేట్రం చేసినప్పటికీ.. తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకున్నాడు మెగాపవర్స్టార్ రామ్ చరణ్. చిరు తనయుడుగా 'చిరుత' పేరుతో సినిమా చేసి.. తెలుగు తెర పై తొలి అడుగులు వేసిన చరణ్..