బాల‌కృష్ణ‌తో మ‌ళ్ళీ అలాగే..

  • IndiaGlitz, [Tuesday,April 24 2018]

నటసింహా నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్‌లో మ‌రో విజ‌యవంత‌మైన చిత్రంగా నిలిచింది.. సంక్రాంతికి విడుద‌లై ఇటీవ‌లే శ‌త‌దినోత్స‌వం పూర్తిచేసుకున్న జై సింహా. ఈ సినిమాని నిర్మించిన సి.క‌ళ్యాణ్‌.. బాల‌కృష్ణ‌తోనే మ‌రో చిత్రం చేయ‌బోతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సందడి చేయ‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే..

బాల‌య్య‌తో సి.క‌ళ్యాణ్ నిర్మించ‌నున్న మూడో చిత్ర‌మిది. అంతేగాకుండా.. గ‌త రెండు చిత్రాలు కూడా సంక్రాంతికే వ‌స్తే.. మూడో చిత్రం కూడా అదే సీజ‌న్‌కు రాబోతోంది. బాల‌కృష్ణతో సి.క‌ళ్యాణ్ నిర్మించిన తొలి చిత్రం ప‌ర‌మ‌వీర‌చ‌క్ర 2011 సంక్రాంతికి విడుద‌ల కాగా.. రెండో చిత్రం జై సింహా ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక‌.. త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నున్న మూడో చిత్రం కూడా సంక్రాంతికే బెర్త్ క‌న్‌ఫ‌ర్మ్ చేసుకోవ‌డం విశేషం.

More News

సోనాలి త‌రువాత కియారానే..

తాజాగా విడుద‌లైన భ‌ర‌త్ అనే నేను.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్‌లో మ‌రో విజ‌య‌వంత‌మైన చిత్రంగా నిలిచిపోయింది.

హైద‌రాబాద్‌లో సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ ఫ్లాట్ పామ్ సెల‌బ్ క‌నెక్ట్‌

సోష‌ల్ మీడియాకు అద‌ర‌ణ అంత‌కు అంత పెరుగుతూనే ఉంది. ఇలాంటి త‌రుణంలో స‌రికొత్త ఐడియాల‌జీతో మ‌న హైద‌రాబాద్ న‌గరంలోకి సెల‌బ్ క‌నెక్ట్ అనే సోష‌ల్ క‌నెక్టింగ్ నెట్ వ‌ర్క్ స్టార్ట‌య్యింది.

మ‌హేష్‌, స‌మంత కంటే దేవిశ్రీకే ఎక్కువ‌

యు.ఎస్‌.లో తెలుగు సినిమాలు మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేర‌డం ఇటీవ‌ల కాలంలో సాధార‌ణ విష‌య‌మైపోయింది.

డబుల్ ఢ‌మాకా ఇవ్వబోతున్న నాగశౌర్య

ఈ ఏడాది ఆరంభంలో విడుద‌లైన‌ ‘ఛలో’ చిత్రంతో.. కెరీర్‌లోనే తొలిసారిగా బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నారు యువ కథానాయకుడు నాగశౌర్య.

'మెహ‌బూబా' సెకండ్ సాంగ్ రిలీజ్‌

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ తన తనయుడు ఆకాష్‌ పూరిని హీరోగా