లక్కీ డైరెక్టర్‌తో మరోసారి

  • IndiaGlitz, [Thursday,November 22 2018]

యాక్షన్‌ హీరో ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో గోపీచంద్‌ ఇప్పుడు ఏ సినిమా చేయాలనే దానిపై ఓ క్లారిటీ తెచ్చుకున్నాడు. 'పంతం' సినిమా తర్వాత గోపీచంద్‌ మరే సినిమా ఒప్పుకోలేదు. ఓ కొత్త దర్శకుడితో చేయాలనుకున్న సినిమా కూడా ఆగిపోయింది. సంపత్‌ నంది దర్శకత్వంలో గోపీచంద్‌ సినిమా చేస్తాడని వార్తలు కూడా వినిపించాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం గోపీచంద్‌, శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని సినీ వర్గాల సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు విజయాన్ని సాధించాయి. శ్రీవాస్‌ గత చిత్రం 'సాక్ష్యం' బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఈ తరుణంలో శ్రీవాస్‌, గోపీచంద్‌తో చేతులు కలుపుతున్నాడు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక సమాచారం వెలువడనుంది.

More News

య‌న్‌.టి.ఆర్ టీజ‌ర్ ఎప్పుడంటే...?

ప్ర‌స్తుతం ఉన్న సోష‌ల్ మీడియాను ఉప‌యోగించుకుంటూ రోజుకోరీతిలో వార్త‌ల్లో నిలుస్తున్న చిత్రం 'య‌న్‌.టి.ఆర్‌'. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ ఇది.

రంగు నా కెరియర్ లో గుర్తండిపోయే  సినిమా... తనీష్

న‌ల్ల‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై త‌నీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు, ష‌ఫీ, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన తారాగ‌ణంగా

4డీ ట‌క్నాల‌జీ.. 120 కెమెరాలు..

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న చిత్రం 'ఆర్ ఆర్ ఆర్‌'. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్నారు.

డేట్ ఫిక్స్ చేసుకున్న నితిన్‌

ఈ ఏడాది 'ఛలో' సినిమాతో స‌క్సెస్ అందుకున్న ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల‌. ఈ యువ ద‌ర్శ‌కుడు నితిన్‌తో 'భీష్మ' సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు.

త‌మిళ రీమేక్‌లో నితిన్‌

యువ హీరో నితిన్ ఓ త‌మిళ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నాడ‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.