close
Choose your channels

పవన్ మళ్లీ సినిమాల్లోకే.. ఫ్యూచర్‌పై రైటర్ జోస్యం!!

Monday, May 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్న సందర్భంలో అటు వైసీపీ.. ఇటు టీడీపీ నేతలు అధికారం మాదంటే మాదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు అన్నీ ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు వైసీపీ వైపే మొగ్గు చూపడంతో ఇక ఆ పార్టీ నేతల మాటలు.. ప్రత్యర్థులపై తూటాల్లా పేలిపోతున్నాయ్.

అంతేకాదు.. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అట్టర్‌ప్లాప్ అయిన ఆంధ్రా ఆక్టోపస్ రాజగోపాల్ సర్వే.. ఏపీలో కూడా డబుల్ అట్టర్ ప్లాప్ అవుతుందని విశ్లేషకులు, క్రిటిక్స్ చెబుతున్నారు. అయితే ఈ సర్వే వ్యవహారాలపై ఇప్పటికే టీడీపీ, వైసీపీ నేతలు స్పందించి తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

అయితే కనుచూపు మేరల్లో వెతికినా.. మైక్రోస్కోప్ పెట్టి వెతికినా జనసేన పార్టీకి ఒక సీటు వస్తుందని సర్వేలు చెబుతున్నాయే తప్ప.. కింగ్ మేకర్, చక్రాలు-బొంగరాలు తిప్పడేం లేదని.. ఇదేం కర్ణాటక కాదని స్పష్టం చేసేశాయి. దీంతో కార్యకర్తలు, మెగాభిమానులు, మెగా బ్రదర్స్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై టాలీవుడ్ ప్రముఖ రచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ గురించి ప్రస్తావిస్తూ.. జనసేనాని ఫ్యూచర్‌ చెప్పేశారు.

నాకు తెలుసు!

"పవన్‌ భవిష్యత్ నాకు క్లియర్‌గా తెలుసు. పవన్ మళ్లీ సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారు. మేకప్ వేయించుకుంటాడు!. సినిమాలలో యాక్ట్ చేస్తారని.. ప్రొడ్యూసర్ పేరు కూడా త్వరలో వింటారు. ఆ ప్రొడ్యూసర్ ఎవరో నాకు తెలుసు.

పవన్ మాతో కథ రాయించుకోడని.. ఆయనకు పెద్ద సక్సెస్ ఇష్టముండదు. ఆయన గురించి వదిలేయడం మంచిది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూడా జనసేన టీడీపీ కలిసి పోటీ చేశాయి. పరోక్షంగా పొత్తు ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లిన నాకు ఈ ఆసక్తికర విషయం తెలిసింది" అని చిన్నికృష్ణ జోస్యం చెప్పారు.

కాగా.. ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుసటి రోజునుంచే.. ఫలితాల తర్వాత జనసేన సంగతేంటి..? పవన్ పొలిటికల్ ఫ్యూచరేంటి..? పవన్ రాజకీయాలు కొనసాగిస్తారా..? అన్నయ్య చిరు మాదిరిగానే మళ్లీ సినిమాల్లోకెళ్లి మేకప్ వేసుకుంటారా..? అని తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హడావుడి.. మీడియాలో కథనాలు ప్రచురించిన విషయం విదితమే. సో.. మే-23 తర్వాత వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల అధినేతల భవిష్యత్ తేలిపోనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.