close
Choose your channels

'యమపాశం' సీడెడ్ హక్కులు దక్కించుకున్న వారాహి

Tuesday, February 16, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిన్న చిత్రాల‌ను ఎంక‌రేజ్ చేస్తూ వాటి విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించ‌డంలో వారాహి చ‌ల‌న చిత్రం ఎప్పుడూ ముందుంటుంది. వారాహిచ‌ల‌న చిత్రం అధినేత సాయికొర్ర‌పాటి మంచి కాన్సెప్ట్ ఉన్న చిన్న చిత్రాల‌ను చూసి వాటి హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటుకు కైవ‌సం చేసుకుని గ్రాండ్ లెవ‌ల్ లో విడుద‌ల చేస్తున్నారు. గ‌తేడాది సూప‌ర్ హిట్ సాధించిన రాజుగారి గ‌ది`, జ‌త కలిసే` చిత్రాల‌ను విడుద‌ల చేసిన సాయికొర్ర‌పాటి ఇప్పుడు యమపాశం` సినిమా సీడెడ్ హక్కులను ఫ్యాన్సీ ఆఫర్ తో చేజిక్కించుకున్నారు.

జయం రవి, లక్ష్మీమీనన్ జంటగా శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం మిరుథన్`. ఈ చిత్రాన్ని సినీ కార్న్ బ్యానర్‌పై తెలుగులో ల‌క్ష్మీ ప్ర‌స‌న్న నిర్మాత‌గా తెలుగులో య‌మ‌పాశం` పేరుతో విడుద‌ల చేస్తున్నారు. డి.ఇమాన్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లు రీసెంట్‌గా విడుద‌ల‌య్యాయి. ఈ పాట‌ల‌కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. జాంబి థ్రిల్ల‌ర్ మూవీగా తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం ఫిభ్ర‌వ‌రి 19న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల అవుతుంది. సౌంతిడియాలో జాంబి థ్రిల్లర్ గా విడుదలవుతన్న తొలిచిత్రమిదే కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.