'యాత్ర' పోస్ట్ పోన్ అవుతుందా?

  • IndiaGlitz, [Saturday,November 17 2018]

దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొందుతోన్న చిత్రం 'యాత్ర‌'. 70 ఎం.ఎం.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'ఆనందో బ్ర‌హ్మ‌' ఫేమ్ మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌రవేగంగా జ‌రుగుతున్నాయి.

జ‌గ‌ప‌తిబాబు, సుహాసిని, రావు ర‌మేశ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ధారులు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 21న వై.ఎస్‌.జ‌గ‌న్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌బోతున్నారంటూ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేశారు. కాగా తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం జ‌న‌వ‌రి చివ‌రి వారంలో విడుదల చేయాల‌నుకుంటున్నార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. మ‌రి దీనిపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

More News

కాళ్ల బేరానికొచ్చిన లైకా

ఇండియాలోనే భారీ బ‌డ్జెట్ చిత్రంగా తెర‌కెక్కింది '2.0'. దాదాపు 550 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ న‌వంబర్ 29న విడుద‌ల కానుంది.

చిరుతో త్రివిక్ర‌మ్‌

మెగాస్టార్ చిరంజీవి త‌న 151వ చిత్రం 'సైరా న‌రసింహారెడ్డి' చిత్రీక‌ర‌ణ‌ను ఇంకా పూర్తి చేయ‌లేదు కానీ..

తమన్నా,సందీప్ కిషన్ ల 'నెక్స్ట్ ఏంటి' ట్రైలర్ లాంచ్ వేడుక..

తమన్నా,సందీప్ కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం 'నెక్స్ట్ ఏంటి'..  బాలీవుడ్ టాప్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. 

వన్ మిలియన్ వ్యూస్ అందుకున్న 'నేను లేను' టీజర్

ఓ.య‌స్‌.యం విజన్ మ‌రియు దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "నేను లేను". లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప‌శీర్షిక‌.

డిసెంబర్ 7న విడుదల కాబోతున్న'కవచం'

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న 'కవచం' సినిమా డిసెంబర్ 7 న రిలీజ్ కాబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.