విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

  • IndiaGlitz, [Wednesday,May 13 2020]

విశాఖ ఎల్‌జీ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది కన్నుమూసిన విషయం విదితమే. తెల్లారుజామున జరిగిన ఈ ప్రమాదంలో పోలీసులు అప్రమత్తమవ్వడంతో మరణాలు చాలానే తగ్గాయి. అయితే ఈ ఘటనపై అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన వాదోపవాదోలు అందరం చూసే ఉంటాం. ఆ కంపెనీకి అనుమతులు మీరు ఇచ్చారంటే.. మీరు ఇచ్చారంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో విశాఖ జిల్లా చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ ఓ డిబెట్‌లో మాట్లాడిన మాటలు తాలుకు వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తుండగా.. ప్రతిపక్షాలు మాత్రం దుమారం రేపే వ్యాఖ్యలు చేస్తోంది. ఎందుకంటే ఆ వీడియో అలా ఉంది మరి.

ఇంతకీ వీడియోలో ఏముంది..!?

ఈ ఘటనపై ఓ ప్రముఖ చానెల్ నిర్వహించిన డిబెట్‌లో దర్మశ్రీ మాట్లాడుతూ.. అనకూడని మాటలు అనేశారు. విశాఖ ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబానికి జగన్ సర్కార్ కేవలం 24 గంటల్లో ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇప్పటికే పలువురికి స్వయంగా మంత్రులే వెళ్లి చెక్‌ను అందజేశారు. ఈ తరుణంలో ఆచి తూచి మాట్లాడాల్సిన దర్శశ్రీ ‘అయ్యో.. మా వాళ్ళు కూడా చచ్చిపోతే బాగుండే మాకు కోటి రూపాయలు వచ్చేవి అని అక్కడి వాళ్ళు అనుకుంటున్నారు’ అని చెప్పకూడదంటూనే చెప్పేశారు. అదే డిబెట్‌లోనే ఈయన మాట్లాడిన మాటలపై పెద్ద రచ్చే జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే వైరల్ అవుతోంది. దీనిపై ఎమ్మెల్యే పదవిలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం అని.. అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై ధర్మశ్రీ.. వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

More News

ఈసారి ఖైరతాబాద్ గణపతి ఒక్క అడుగే..!

తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశ్‌కు ప్రత్యేక స్థానం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. రూపంలో ఏటికేడు కొత్తదనం సంతరించుకుంటూ కనువిందు చేసే ఈ భారీ గణేశుడిని

'కరోనా' లాక్ డౌన్ 4.0పై తేల్చేసిన మోదీ..!

కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా ఇండియాలో అయితే రోజురోజుకూ కరోనా కేసులు, అనుమానితులు, మరణాలు పెరిగిపోతున్నాయే తప్ప అస్సలు తగ్గట్లేదు.

కష్టకాలంలో 20 లక్షల కోట్ల ప్యాకేజి ప్రకటించిన ప్రధాని

కరోనా కష్టాల్లో ఉన్న భారతీయులను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. రూ.20 లక్షల కోట్లతో ‘ఆత్మ నిర్భర్ అభియాన్’ పేరుతో కొత్త ఆర్థిక ప్యాకేజీ

జాతినుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ కరోనా పరిస్థితులు, లాక్ డౌన్ పరిణామాలపై జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ 8 గంటలకు మాట్లాడిన ఆయన.. ప్రాణాలు కాపాడుకుంటూ

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ 168 రిలీజ్ డేట్‌!!

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ 168వ చిత్రం ‘అణ్ణాత్త‌’ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. తెలుగులో ద‌రువు, శంఖం, శౌర్యం చిత్రాల‌తో పాటు త‌మిళంలో వివేగం, విశ్వాసం