మే 24న 'ఎవడు తక్కువ కాదు'

  • IndiaGlitz, [Friday,May 17 2019]

'పోయిన చోటే వెతుక్కోవాలి' అని తెలుగులో ఒక నానుడి. 'పడిన చోటే పైకి లేచి నిలబడాలని' పెద్దలు చెబుతారు. ఒక మార్కెట్‌లో కుర్రాడు పడిన చోటే పైకి లేచి నిలబడాలని ప్రయత్నించాడు. వయసులో చిన్నోడు అయినా ధైర్యంగా మార్కెట్‌లో పెద్దలతో తలపడ్డాడు. అప్పుడు ఆ పెద్దలు ఏం చేశారు? ఆ కుర్రాడు, అతడికి ఉన్న వ్యక్తులు ఎలా ఎదుర్కొన్నారు? ఈ యుద్ధంలో చివరికి ఏమైంది? అనేది మే 24న ప్రేక్షకుల ముందుకొస్తున్న 'ఎవడు తక్కువ కాదు' చూసి తెలుసుకోమంటున్నారు దర్శకుడు రఘు జయ.

విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'ఎవడు తక్కువ కాదు'. 'ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్'... ఉపశీర్షిక. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి  శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రానికి రఘు జయ దర్శకుడు. హరి గౌర సంగీత దర్శకుడు. సెన్సార్ బోర్డ్ సినిమాకు 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. మే 24న సినిమా విడుదలవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రచార చిత్రాలకు, పాటలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడం ఆనందంగా ఉంది. పగ, ప్రతీకారం నేపథ్యంలో సరికొత్త కథ, కథనంతో రూపొందిన చిత్రమిది. అలాగే, ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంటుంది. దర్శకుడు రఘు జయ చాలా సహజంగా చిత్రాన్ని తెరకెక్కించాడు. రియలిస్టిక్, రా అప్రోచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ట్రైల‌ర్‌లో విక్రమ్ సహిదేవ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ బావుందని, అగ్రెస్సివ్‌గా చేశాడని ప్రశంసిస్తున్నారంతా. ట్రైలర్ విడుదల చేసిన సుకుమార్ గారు కూడా మెచ్చుకున్నారు. సినిమా చూసి ప్రేక్షకులు మా విక్రమ్ ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమిది అని అన్నారు.

ప్రియాంక జైన్ కథానాయికగా, రఘు కారుమంచి కీలకపాత్రలో నటించిన ఈ చిత్రానికి హరి గౌర సంగీత దర్శకుడు. రఘు జయ దర్శకుడు. లగడపాటి శ్రీధర్ నిర్మాత. లగడపాటి శిరీష సమర్పణ.

More News

ద‌ర్బార్ షెడ్యూల్ పూర్తి.. త‌దుప‌రి షెడ్యూల్ ఎప్పుడంటే...

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `ద‌ర్బార్‌`. ఎ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌కుడు.

త‌దుప‌రి కూడా అదే ద‌ర్శ‌కుడితో....

త‌మిళ స్టార్ హీరో అజిత్ 59 వ చిత్రం `నేర్కొండ పార్వై`. బాలీవుడ్ చిత్రం `పింక్‌`కు ఇది త‌మిళ రీమేక్‌.

'ఇండియ‌న్ 2' ఆగిపోలేదు...

యూనివ‌ర్స‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ సుభాష్ క‌ర‌ణ్  కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇండియ‌న్ 2`.

విల‌న్‌గా ఐశ్వ‌ర్యారాయ్‌

ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించిన ఐశ్వ‌ర్యారాయ్‌.. చాలా గ్యాప్ త‌ర్వాత ద‌క్షిణాదిన సినిమా చేయ‌నుంది.

సమంత, ఉప్సీకి అక్కినేని అమల ఛాలెంజ్

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మనం 'రైస్ బకెట్ ఛాలెంజ్', 'ఫిట్ నెస్ ఛాలెంజ్', 'మొక్కల పెంపకం' ఇలా పలు ఛాలెంజ్‌లు చూశాం. అయితే ఇప్పుడు మరో ఛాలెంజ్ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతోంది.