close
Choose your channels

ఏడాదికో చిత్రం చేస్తున్న యంగ్ హీరో

Monday, June 11, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏడాదికో చిత్రం చేస్తున్న యంగ్ హీరో

యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్‌కు క‌లిసొచ్చిన క‌థానాయిక‌ల్లో హెబ్బా ప‌టేల్ ఒక‌రు. కుమారి 21 ఎఫ్‌(2015)తో మొద‌లైన వీరి కాంబినేష‌న్‌ ఈడో ర‌కం ఆడో ర‌కం (2016), అంధ‌గాడు (2017) వ‌ర‌కు కొన‌సాగింది. అతి త్వ‌ర‌లో ఈ ఇద్ద‌రూ మ‌రో సినిమాలో క‌లిసి న‌టించ‌బోతున్న‌రంటూ క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

కాస్త వివ‌రాల్లోకి వెళితే.. త‌మిళంలో ఘ‌న‌విజ‌యం సాధించిన నానుమ్ రౌడీదాన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

విజ‌య్ సేతుప‌తి పాత్ర‌లో రాజ్ త‌రుణ్ న‌టించ‌నున్న ఈ సినిమాలో న‌య‌న‌తార పోషించిన చెవిటి అమ్మాయి పాత్ర‌లో హెబ్బా ప‌టేల్ న‌టించే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. అదే గ‌నుక నిజ‌మైతే.. హెబ్బాతో రాజ్ త‌రుణ్ ఏడాదికో సినిమా చేయ‌డం వార్త‌ల్లో నిలిచే విష‌యం అవుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.