తల్లిని చంపి.. సోదరుడ్ని పొడిచి.. ప్రియుడికి మాటిచ్చి.. అండమాన్‌కు!!

  • IndiaGlitz, [Thursday,February 06 2020]

మానవత్వం మంట గలిసింది. అసలు తామేం చేస్తున్నామో.. అసలెందుకిలా చేస్తున్నామో తెలియక కొందరు పిచ్చిపిచ్చి ప్రవర్తించి కుటుంబ సభ్యులను చంపేందుకు కూడా వెనుకాడట్లేదు. సమస్యలు వచ్చేది పరిష్కారం కోసమే.. కాస్త మనసుపెట్టి ఆలోచిస్తే ఆ సమస్యకు కచ్చితంగా పరిష్కారమార్గాల దొరుకుతాయ్.. కానీ ఆ ఒక్కటీ చేయకుండా ఇంకేవేవో చేసేసి నేరాలు ఘోరాలకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రేమ, దోమ అంటూ నవమోసాలు కనిపెంచిన తల్లిదండ్రులను కాటికి పంపడానికి కూడా ఏ మాత్రం వెనుకాడకుండా ఉన్నారు. అయితే ఇలాంటి వారిలో మగవారికంటే ఆడవాళ్లలో కొందరు మరీ బరితెగిస్తుండటం గమనార్హం. ఇదిగో మీరు చదవబోయే ఈ ఆర్టికల్‌ను వామ్మో.. ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతారేమో మరి.

ప్రియుడితో కలిసి ప్లాన్!
తండ్రి అనారోగ్యంతో చనిపోయాడు.. తల్లి ఉంది. తమ్ముడు, సోదరి ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. ప్రశాంతంగా జీవితం సాగుతుండగా అమృత చెడు తిరుగుళ్లు మొదలయ్యాయ్. మరోవైపు అప్పుడే తండ్రి ఊపిరితిత్తుల వ్యాధితో మరణించాడు. ఇలా మొత్తం రూ. 15లక్షలు పాటు అప్పుచేసేసింది. తెలిసినవాళ్లు కావడంతో కొన్నిరోజుల పాటు డబ్బులు అడగలేదు. వాళ్లు ఫలానా రోజు ఇంటికి వస్తున్నారని చెప్పడంతో ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందో ఏమోనని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. తీరా చూస్తే ప్లాన్ రివర్స్ అయ్యింది.. ఎక్కడికెక్కడో తిరిగొచ్చి చివరికి పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైంది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.

అసలేం జరిగింది!?
పూర్తి వివరాల్లోకెళితే.. అప్పుల్లో కూరుకుపోయిన అమృత.. ఆ విషయం ఇంట్లో తెలిస్తే ఎక్కడ నిలదీస్తారో అని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. తల్లిని చంపేసి ఇంట్లో నుంచి పరారైపోవాలన్నది ఆ ప్లాన్ సారాంశం. అనుకున్నట్లుగానే లవర్ ఇంటిముందు బండితో రెడీగా ఉన్నాడు. ఓ వైపు ఫోన్ కాల్ నేను రెడీగా ఉన్నాను.. పని కానిచ్చేసి వచ్చెయ్ అని. తల్లిని కత్తి తీసుకుని పొట్టలో పొడిచేసింది.. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. నిద్రలో ఉన్న తమ్ముడికి శబ్ధం రావడంతో టక్కున లేచి వచ్చి చూడగా.. తమ్ముడికి తెలిసిపోయిందని.. అతన్ని కూడా చంపబోయింది.. కత్తితో రెండు మూడుసార్లు పొడిచింది.. కొనప్రాణాలతో ఉన్న అతను ఎట్టకేలకు ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

ప్రియుడితో పరారీ..!
అమ్మ విగతజీవిగా పడివుండగా.. తమ్ముడిని పొడిచేసి.. చనిపోయుంటాడని ఇంట్లో నుంచి బయటికొచ్చేసిన అమృత ప్రియుడితో కలిసి బైక్‌పై వెళ్లిపోయింది. నేరుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి అండమాన్ నికోబార్‌లోని పోర్ట్‌బ్లెయిర్‌కు వెళ్లారు. అక్కడ మూడు నాలుగురోజులుగా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. బంధువులతో కలిసి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఎట్టకేలకు పట్టుకున్నారు. పోర్ట్‌బ్లెయిర్ వెళ్లిన పోలీసుల స్పెషల్ టీమ్ అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. విచారణలో ఇలా ఇలా జరిగింది.. పూసగుచ్చినట్లు చెప్పడంతో పోలీసులు ఒకింత కంగుతిన్నారు.

మాటిచ్చా..!
ఎందుకు చంపాల్సి వచ్చింది.. సోదరుడ్ని కూడా ఎందుకు..? ఇలా అన్ని విషయాలను చెప్పిన అమృత.. ప్రియుడికి పోర్ట్‌బ్లెయిర్‌‌కు వస్తానని మాటిచ్చానని అందుకే అతనితో కలిసి వెళ్లానని అక్కడ కొన్నిరోజులు ఎంజాయ్ తీసి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే సెటిల్ అయిపోదామని అనుకున్నట్లు అమృత చెప్పింది. మరి తీవ్రగాయాలతో ఉన్న సోదరుడి పైకి లేస్తే ఇంకెన్ని ట్విస్ట్‌లు ఇస్తారో ఏంటో..!

More News

పాటల విడుదల సన్నాహాల్లో 'కృష్ణమనోహర్ ఐ.పి.ఎస్'

డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా, హీరోగా, దర్శకుడిగా పలు సంచలన విజయాలు సాధించడం తెలిసిందే.

పూరి జ‌గ‌న్నాథ్‌, విజ‌య్ దేవర కొండ.. సరికొత్త టైటిల్..!

యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈయ‌న హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో

'ఆర్ఆర్ఆర్‌' లో ఛాన్స్ ద‌క్కించుకున్న హాట్ బ్యూటీ

ప‌లు సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌, స్పెష‌ల్ రోల్స్‌లో న‌టిస్తోన్న హాట్ బ్యూటీ హంస నందిని ఇప్పుడు భారీ ఛాన్స్‌ను ద‌క్కించుకుంది.

క‌రోనా దెబ్బ‌..వాయిదా వేసుకున్న నాగ్‌!

ప్ర‌పంచం అంతా క‌రోనా ఎఫెక్ట్‌తో భ‌య‌ప‌డుతుంది. ఈ ఎఫెక్ట్ కార‌ణంగా ప్ర‌జ‌లు వేరే ప్ర‌దేశాల‌కు వెళ్లాలంటే భ‌య‌ప‌డుతున్నారు.

పవన్ హీరోయిన్ ఖ‌రారు.. ఈసారి హిట్ కొడతాడా?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఏక‌ధాటిగా సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే మూడు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు.