close
Choose your channels

ఫొటో తెచ్చిన తంటా.. జగన్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్.. ఫైనల్‌గా..!

Wednesday, June 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఫొటో తెచ్చిన తంటా.. జగన్ వర్సెస్ బాలయ్య ఫ్యాన్స్.. ఫైనల్‌గా..!

రెండ్రోజులుగా సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ నటుడు నందమూరి బాలయ్య అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున యుద్ధమే జరుగుతోంది. ఇందుకు కారణం బాలయ్యకు జగన్ వీరాభిమానట. ఆయన సినిమాలు రిలీజ్ అయినప్పుడు జగన్ పెద్ద పెద్ద యాడ్‌లు వేయించేవారట.. అసలు ఇదంతా నిజమేనా..? టీడీపీ వీరాభిమానులు ఎవరైనా ఇలా చేస్తున్నారా..? అనేది ఈ కథనంలో చూద్దాం.

ఇదీ అసలు కథ..!?

ఇదిగో చూస్తున్నారుగా ఇది.. 2000 సంవత్సరానికి చెందిన పేపర్ కటింగ్. దీనిలో నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ ప్రకటన స్పష్టంగా కనపడుతోంది. ఈ ప్రకటన ఇచ్చింది సాక్షాత్తు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ‘2000 నూతన సంవత్సర శుభాకాంక్షలతో వై.యస్.జగన్మోహన్ రెడ్డి, ప్రెసిడెంట్, కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం’ అని ఆ ప్రకటనలో రాసి ఉంది. అంతేకాదు జగన్ అప్పటి ఫొటో కూడా దీనిపై ముద్రించారు. మొత్తం మీద ‘సమరసింహారెడ్డి’ 365 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడి హోదాలో జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నట్లు దీని అర్థం.

ఫైనల్‌గా తేలిందేంటి..!?

అయితే ఇది ఫొటో షాప్‌లో చేశారా..? లేకుంటే రియలేనా..? అన్నది ఇంతవరకూ తెలియరాలేదు కానీ.. సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ అభిమానులు.. బాలయ్య అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ చేసుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్.. మా బాలయ్యగారి అభిమాని అని వాళ్లు చెబుతుండగా.. అదంతా ఫేక్ అసలు విషయం అది కాదంటూ వీళ్లు పెద్ద రచ్చే చేస్తున్నారు. వాస్తవానికి ఈ పేపర్ యాడ్‌లో ఉన్న జగన్ ఫొటో 2003లో తీసిందని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు చెబుతున్నారు. అంతేకాదు జగన్ తన భార్య భారతితో ఉన్న ఫొటోను సైతం పోస్ట్ చేశారు. అయితే ఈ కలర్ ఫొటోలో జగన్ ఇమేజ్‌ను తీసుకొని బ్లాక్ అండ్ వైట్‌గా మార్చి ఈ పేపర్ యాడ్‌లో తగిలించేశారని వైసీపీ వీరాభిమానులు గోల చేస్తున్నారు.

ఒకే ఒక్కసారి అంతే..!

ఇంతకు మించి ఏమీలేదని.. బాలయ్యకు జగన్ అభిమాని అస్సలు కాదని.. ఇలా ఫొటో షాప్‌లో తగిలించేసినంత మాత్రాన అభిమాని ఎలా అవుతారు..? కాస్త ఈ మార్ఫింగ్ వ్యవహారాలు తగ్గించండి తమ్ముళ్లు.. తమ్ముళ్ల అభిమానులు అని వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు హితవు పలుకుతున్నారు. అంతేకాదు.. టీడీపీ అభిమానులు మరీ ఇంత నీచానికి దిగజారుతున్నారేంటి..? అని వైసీపీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. టీడీపీ ఎమ్మెల్యేలు అందరిలో బాలయ్యే మంచివారని అసెంబ్లీ లాభీల్లో అనడం అప్పట్లో మీడియాలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన మినహా వైఎస్ జగన్-బాలయ్య ఇద్దరూ ప్రత్యక్షంగా మాట్లాడుకున్న సందర్భాలు అస్సలు లేవని చెప్పుకోవాలి. అయితే ఈ వ్యవహారానికి ఇటు వైసీపీ నుంచి అటు టీడీపీ నుంచి ఎవరైనా నేతలు మాట్లాడి క్లారిటీ ఇస్తారో లేకుంటే ఇవన్నీ చిల్లీ అని లైట్ తీసుకుంటారో తెలియాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.