close
Choose your channels

ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం..: ‘జయహో’లో జగన్

Monday, August 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం..: ‘జయహో’లో జగన్

‘ప్రజాసంకల్పయాత్ర’ పేరుతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చారిత్రాత్మకంగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాదయాత్రకు సంబంధించిన అన్ని వివరాలు భవిష్యత్ తరాలకు తెలియాలనే ఉద్దేశ్యంతో ‘జయహో’ అనే పుస్తకాన్ని ప్రముఖ పాత్రికేయులు రామచంద్రమూర్తి రచించారు. కాగా 14 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రలోని వివిధ చారిత్రాత్మక ఘట్టాలను.. 3,648 కి.మీ సుధీర్ఘంగా సాగిన పాదయాత్రను ఫోటోలతో సహా పుస్తకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. సోమవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం!

"ప్రజాసంకల్ప పాదయాత్ర అనేది ఒక స్పిరిట్‌. 3648 కి.మీ పాదయాత్ర చేయడమంటే సామాన్యమైన విషయం కాదు. ప్రజల సహకారంతోనే నేను విజయవంతంగా 14 నెలల పాటు పాదయాత్ర పూర్తి చేశాను. ప్రజలతో కలిసి సాగిన ఈ ప్రయాణంలో ప్రతి పేదవాడిని కలిశాను. పాదయాత్ర ఫలితంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50 శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయి. ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయను. ప్రతీక్షణం ప్రజల కోసమే పనిచేస్తాను" అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన పాదయాత్రపై పుస్తకాన్ని రచించిన పెద్దలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.