‘నా మతం మానవత్వం.. నా కులం మాట నిలబెట్టుకోవడం’ - జగన్‌

  • IndiaGlitz, [Monday,December 02 2019]

‘నా మతం మానవత్వం.. కులం మాట నిలబెట్టుకోవడమే’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. తన కులం, మతంపై ప్రతిపక్షాలు పదేపదే ప్రస్తావించడాన్ని ఆయన తప్పుపట్టారు. పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నామని.. అలాగే ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. కాగా.. సోమవారం మధ్యాహ్నం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ‘వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా’ కార్యక్రమాన్ని జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా.. రోగులకు ఆర్థికసాయం చెక్కులను తన చేతులమీదుగానే స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. విశ్రాంతి సమయంలో పేషెంట్ కోలుకునే వరకు ఆర్థికసాయం చేస్తామని హామీ ఇచ్చారు.

నా మతం మానవత్వం.. నా కులం..!

మేనిఫెస్టో అన్నది ఒక భగవత్గీత, ఖురాన్‌, బైబిల్‌గా పాటిస్తూ..ఇచ్చిన మాటను నెరవేర్చుతున్నాను. ఈ రోజు రకరకాల ఆరోపణల మధ్య ఇవాళ రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం. మంచి పరిపాలన జరుగుతుంటే ఇవాళ జీర్ణించుకోలేని పరిస్థితి. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఈ మధ్య కాలంలోనే నా మతం, కులం గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటిమాటలు వింటే బాధనిపిస్తోం. ఇదే వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. నా మతం మానవత్వం, నా కులం మాట నిలబెట్టుకోవడం. ప్రస్తుతం నాకు సంబంధం లేని అంశాలపై పెద్దదిగా చేసి చూపుతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. కుతంత్రాలు పన్నినా గట్టిగా నిలబడతాను. దేవుడి దయ, ప్రజల దీవెనలు నాకు ఉన్నాయి. మొదటి నుంచీ ప్రజలు, దేవుణ్ణే నమ్మాను. మీరంతా నన్ను దీవించాలి. ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంటే సంతోషంగా ఉంది’ అని చెబుతూ జగన్ భావోద్వేగానికి లోనయ్యారు.

More News

ఆర్జీవీ ‘కమ్మరాజ్యానికి’ సర్టిఫికెట్ రద్దు చేసిన సెన్సార్ బోర్డ్

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’‌ వివాదాల్లో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే.

'వెంకీమామ' రిలీజ్.. ప్రీ రిలీజ్‌పై ఓ క్లారిటీ

ఎట్ట‌కేల‌కు `వెంకీమామ‌` రిలీజ్ డేట్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు సంబంధించి నిర్మాత‌ల‌కు ఓ క్లారిటీ వ‌చ్చింద‌ని టాక్‌.

'ఓన్లీ నేను' ట్రైలర్ లాంచ్

శరకడం స్టోరీస్ పతాకం పై చెంగ్ , మైరా అమితి జంటగా విగ్నేష్ కలగర డైరెక్షన్ లో శ్రీనివాస్ శరకడం నిర్మిస్తోన్న చిత్రం `ఓన్లీ నేను`.

'భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`.

తమిళనాడులో వర్షాలకు ఘోరం.. 15 మంది మృతి

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలో గత రెండ్రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.