YS Jagan: ఏనాడూ వెనుకడుగు వేయలేదు.. ఇకపై జగన్ 2.O చూస్తారు


Send us your feedback to audioarticles@vaarta.com


ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై తనలో మరో కోణాన్ని చూస్తారని అంటున్నారు. ఈ మేరకు తన పార్టీ నేతలకు, కార్యకర్తలకు హామీ ఇచ్చారు.
విజయవాడ వైసీపీ కార్పోరేటర్లతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సారి "జగన్ 2.0"ని చూస్తారని శ్రేణులకు హామీ ఇచ్చారు. తన రెండో రూపం వేరేగా ఉంటుందని, కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానని అన్నారు.
తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయం పడ్డానని.. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయాననే విషయాన్ని జగన్ అంగీకరించారు. ఇప్పుడు చంద్రబాబు కార్యకర్తల్ని, నేతల్ని పెడుతున్న కష్టాలు, బాధలను కళ్లారా చూస్తున్నానని, తన వాళ్లను ఇబ్బంది పెడుతున్న వాళ్లను వదిలిపెట్టేది లేదని అన్నారు వైఎస్ జగన్.
"ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని కష్టాలు సహజం. కష్టాలు వచ్చినా మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. కష్టాలు అనేవి ఎల్లకాలం ఉండవు. ఇది వాస్తవం. రాజకీయంగా ఎదుగుతున్నానని నాపై కక్ష కట్టారు. కాంగ్రెస్, టీడీపీ కుట్రతో 16 నెలలు జైల్లో పెట్టారు. అయినా ఏనాడూ వెనుకడుగు వేయలేదు. ఎక్కడా తగ్గలేదు. ఎంతో ధైర్యంతో నిలబడ్డాను. ప్రజల గుండెల్లో నిలిచాను."
అలా ప్రజల అండతో ముఖ్యమంత్రి అయ్యానని, తమ పార్టీ కచ్చితంగా మరోసారి అదికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు జగన్. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏకథాటిగా పాలిస్తానని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments