close
Choose your channels

జగన్ మరో కీలక నిర్ణయం: డిగ్రీ నాలుగేళ్లు.. బీటెక్ ఐదేళ్లు

Friday, December 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జగన్ మరో కీలక నిర్ణయం: డిగ్రీ నాలుగేళ్లు.. బీటెక్ ఐదేళ్లు

అవును మీరు వింటున్నది నిజమే.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తానేంటో కేవలం ఎనిమిది నెలల్లోనే నిరూపించుకున్నారు. ఇప్పటికే పలు కీలక చట్టాలను.. సంచలన నిర్ణయాలు తీసుకున్న జగన్.. తాజాగా ‘దిశ చట్టం’ చట్టం తీసుకొచ్చిన విషయం విదితమే. అయితే ఆ చట్టం శాసనసభ, శాసన మండలిలో ఆమోదించిన రోజే.. మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇకపై ఏపీలో డిగ్రీ నాలుగేళ్లు.. బీటెక్ ఐదేళ్లు కానుందన్నదే ఆ నిర్ణయం సారాంశం. విద్యార్థులు చదువుకునే కోర్సులు ఉద్యోగాలు తెచ్చిపెట్టే విధంగా ఉండాలని జగన్ అభిప్రాయ పడ్డారు. శుక్రవారం సాయంత్రం విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆంధ్రా యూనివర్సీటీ పూర్వవిద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

డిగ్రీ నాలుగేళ్లు.. బీటెక్ ఐదేళ్లు!

‘ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు మేలు చేస్తాయి. ఏపీలోని విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలని భావిస్తున్నాం. మూడేళ్ల డిగ్రీని నాలుగేళ్లు చేసి.. ఒక సంవత్సరం జాబ్ ఓరియెంటెడ్ శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నాం. బీటెక్ కోర్సును కూడా ఐదేళ్లు చేసిన ఇదే రకమైన విధానాన్ని అమలు చేయాలని అనుకుంటున్నాం. కాలేజీ, యూనివర్సిటీల్లో చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు... తాము చదువుకున్న విద్యాసంస్థలకు ఎంతో కొంత మేలు చేయాలి. స్కాలర్ షిప్స్ విషయంలో ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును తాము భరించే విధంగా పూర్తిస్థాయిలో స్కాలర్ షిప్స్ ఇస్తాం’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.