'యాత్ర' మూవీ చూసి కంటతడిపెట్టిన వైఎస్ విజయమ్మ

  • IndiaGlitz, [Monday,February 11 2019]

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌‌రెడ్డి పొలిటికల్ జర్నీలో కీలకమైన 'పాదయాత్ర' నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా మహి వి. రాఘవ తెరకెక్కించిన చిత్రం 'యాత్ర'. ఫిబ్రవరి 8న థియేటర్లలోకి వచ్చిన 'యాత్ర' సక్సెస్‌ఫుల్‌‌గా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన వైఎస్ అభిమానులు, సినీ ప్రియులు, పలువురు ప్రముఖులు డైరెక్టర్‌‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు 'యాత్ర' చూసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌‌.. మహిని మెచ్చుకున్నారు. తాజాగా జగన్‌‌ కుటుంబ సభ్యులు ఈ సినిమా తిలకించారు.

అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు

సినిమా చూసి బయటికొచ్చిన తర్వాత వైఎస్ విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ కంటతడిపెట్టారు. వైఎస్ ఈ లోకాన లేకపోయినా ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టకుండా .. ఆయన పిల్లలను అక్కున చేర్చుకున్న ప్రజలందరూ ఈ ‘యాత్ర’ సినిమాను చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా వారందరికీ పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. కోట్లాది హృదయాంతరాల్లో ఉన్న రాజశేఖర్‌ రెడ్డి జ్ఞాపకాలను ’యాత్ర’ ద్వారా దర్శక, నిర్మాతలు తట్టిలేపారని విజయమ్మ ఒకింత ఆవేదనకు లోనయ్యారు.

మమ్ముట్టి, ఆశ్రిత పాత్రల గురించి..

వైఎస్ సజీవంగా మనముందు లేకపోయినా... ‘యాత్ర’ ద్వారా ఆయనను డైరెక్టర్.. మరోసారి మనముందుకు తీసుకువచ్చారన్నారు. మహి చాలా బాగా సినిమా తెరకెక్కించారని ఆమె కితాబిచ్చారు. వైఎస్ పాత్రలో నటించిన స్టార్ హీరో మమ్ము్ట్టిపై విజయమ్మ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా తన పాత్రలో ఆశ్రిత చాలా బాగా నటించిందని విజయమ్మ అభినందించారు. అయితే వైఎస్ విజయమ్మ వ్యాఖ్యలకు మమ్ముట్టి, మహి, ఆశ్రితల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.

More News

మోసపోవద్దు.. అన్న సీఎం అవుతాడని చెప్పండి!

"సీఎం చంద్రబాబు ఎన్నికల టైమ్‌‌లో ఇచ్చే మూడువేల రూపాయలకు మోసపోవద్దని కార్యకర్తలంతా ప్రతి  అమ్మకు, అక్కకు, చెల్లికి గట్టిగా చెప్పండి.

చంద్రబాబుకు సడన్ షాకిచ్చిన మమతా!

ఏపీ సీఎం చంద్రబాబుకు.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చెడిందా..? ఇన్ని రోజులు ఇద్దరూ జాతీయ స్థాయి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వీళ్లు ఎందుకు ఎడమొఖం..

బాబు దీక్షలో ప్రత్యేక ఆకర్షణగా ‘మల్లెపూల ఆంటీ’!

ఏపీకి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీఎం చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ధర్మపోరాట దీక్ష’

'జెస్సీ' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

హార‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు ఉన్న క్రేజ్ వేరు.. న‌టీన‌టుల ప‌నితీరుతో పాటు  డైరెక్ట‌ర్ టేకింగ్‌.. సౌండ్, గ్రాఫిక్స్‌, కెమెరా వ‌ర్క్

అవయవాలు దానం చేసిన మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్..

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ పుట్టిన‌రోజు వేడుక‌లు ఫిబ్ర‌వ‌రి 11న అభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగాయి.