డిసెంబర్ 21న వై ఎస్ అర్ బయోపిక్ యాత్ర విడుదల

  • IndiaGlitz, [Wednesday,September 12 2018]

ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రిగా రాష్ట్ర‌ రాజ‌కీయాల్ని తిర‌గ‌రాసిన డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారి జీవిత చరిత్ర ను యాత్ర పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో జీవిస్తున్నారు.

ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ తో ఈ విషయం స్పష్టమైంది. మొదటి సింగిల్ సాంగ్ తో యాత్ర స్టోరీ లోని హై ఇంటెన్సిటీ చూపించారు. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ బ‌యెపిక్ ని తెర‌కెక్కిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ హంగులతో యాత్ర చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. వై ఎస్ ఆర్ పార్టీ అధ్యక్షుడు, వై ఎస్ ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ డే కానుకగా యాత్ర చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి మాట్లాడుతూ.... మ‌డ‌మ‌తిప్ప‌ని నాయకుడి పాత్ర‌లో న‌టిస్తున్న మమ్మ‌ట్టి గారు... ప్ర‌జానాయ‌కుడు వై ఎస్ ఆర్ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన యాత్ర మెద‌టి లుక్ కి, టీజ‌ర్ కి, ఫస్ట్ సింగిల్ కు రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల నుండి అనూహ్య‌మైన స్పంద‌న రావడంతో చాలా సంతోషంగా ఉంది. మా బ్యానర్ నుంచి భ‌లేమంచిరోజు, ఆనందోబ్ర‌హ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం.

ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్ర‌లు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా చూడ‌వ‌ల‌సిన చిత్రంగా తెర‌కెక్కిస్తున్నాం. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్ర లో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నాం.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. అని అన్నారు

More News

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'క్రేజీ క్రేజీ ఫీలింగ్'

విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం 'క్రేజీ క్రేజీ ఫీలింగ్ '. సంజయ్ కార్తీక్ దర్శకుడు విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటిస్తున్నారు .

స్టూడెంట్ పాత్ర‌లో..

రెజీనా క‌సండ్ర‌.. త‌మిళ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ చెన్నై అమ్మడు తెలుగు సినిమాల్లో రాణించే ప్ర‌య‌త్నాలు చేసింది. కొంత మేర స‌క్సెస్ సాధించినా స్టార్ హీరోయిన్‌గా మాత్రం పేరు తెచ్చుకోలేక‌పోయింది.

ర‌ష్మిక బ్రేకప్‌పై ఆమె త‌ల్లి ప్ర‌క‌టన‌.. ర‌క్షిత్ స్పంద‌న‌...

క‌న్న‌డంలో కిర్రిక్ పార్టీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ర‌ష్మిక మంద‌న్నా.. తొలి చిత్రంతో మంచి స‌క్సెస్ సాధించ‌డంతో హీరో ర‌క్షిత్‌తో ప్రేమ‌లో పడింది. ఇద్ద‌రి ప్రేమ‌కు పెద్ద‌లు అంగీకారం తెల‌ప‌డంతో..

జ్యోతిక త‌దుప‌రి చిత్రం..

న‌టి జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్‌లో మహిళా ప్ర‌ధాన‌మైన పాత్ర‌ల‌ను చేయ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. `36 వ‌య‌దినిలే, మ‌గ‌లిర్ మ‌ట్రుమ్‌, నాచియార్‌, చెక్క‌చివ్వంద వాన‌మ్‌(న‌వాబ్‌)..

సామ్ స్టోరీ చెప్పేటప్పుడు ఎంతో థ్రిల్ గా ఫీల్ అయ్యాను: నాగార్జున

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ' యూ టర్న్'.. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 13 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా మిస్టరీ థ్రిల్లర్ జోన్ గా రానుండగా పవన్ కుమార్ దర్శకుడు..