close
Choose your channels

దమ్ముంటే బయటికొచ్చి మాట్లాడు ‘420 తాతయ్యా’!

Tuesday, September 10, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దమ్ముంటే బయటికొచ్చి మాట్లాడు ‘420 తాతయ్యా’!

టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు. రోజుకో సోషల్ మీడియా వేదికగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పార్టీ పరంగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఒకరు లొసుగులు మరొకరు బయటపెట్టుకుంటున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విజయసాయి ట్వీట్‌లకు బుద్ధా కౌంటర్లివ్వడం.. మళ్లీ ఆయన రియాక్ట్ అవ్వడం ఇలా అస్తమాను విమర్శలు గుప్పించుకుంటున్నారు.

విజయసాయి ఏమన్నారు!?
‘పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేమీ పట్టదు. లక్షల కోట్ల రియలెస్టేట్ రాబడుల గురించే వారి ధ్యాస అంతా. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టించి, అనుకూల మీడియాతో అలజడి రేపాలని చూస్తున్నారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి మీరు చేసింది అదే కాదా’ అని విజయసాయిరెడ్డి తన ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

బుద్ధా స్ట్రాంగ్ కౌంటర్!
‘సిగ్గులేని సాయిరెడ్డి... అమరావతిలో లక్షల కోట్ల అవినీతి జరిగిందా? మీరు అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయింది. అవినీతిని నిరూపించకుండా ఏం గడ్డి పీకుతున్నారు. నోరు ఉంది కదా అని అడ్డమైన ఆరోపణలు చేయడం ఆపండి. అధికారంలో ఉన్నది మీరే అనే విషయాన్ని మర్చిపోకండి. నీ దొంగ పేపర్‌లో రాసే వార్తలు అక్షరసత్యాలా? ప్రపంచ బ్యాంక్ వెనక్కి వెళ్లిపోవడానికి మీ కుట్రే కారణమని పత్రికలు బయటపెడితే... అవి పచ్చ పత్రికలు అని మీడియాను అవమానపరుస్తారా? రాజధానిపై ట్విట్టర్‌లో కాదు... దమ్ముంటే అక్కడకు వచ్చి రైతుల ముందు మీ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పి వెళ్లండి 420 తాతయ్యా’ అని విజయసాయిపై బుద్ధా మండిపడ్డారు. మరి ఈ వ్యాఖ్యలకు విజయసాయి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.