close
Choose your channels

కట్టప్ప కోపంతో బంద్ కు పిలుపు...

Wednesday, April 19, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`బాహుబ‌లి 2`లో క‌ట్ట‌ప్ప‌గా న‌టించిన స‌త్య‌రాజ్ క‌న్న‌డిగులుపై తొమ్మిదేళ్ళ క్రితం చేసిన వ్యాఖ్యలు వివాద‌స్ప‌దం అవుతున్నాయి. కావేరీ జ‌లాలు విష‌యంలో త‌మిళనాడు, క‌ర్ణాట‌క రాష్ట్రాల మ‌ధ్య చిచ్చు ఉంటూనే ఉంది. ఈ వివాదం ఇప్పుడు బాహుబ‌లి 2 విడుద‌ల‌పై ఎఫెక్ట్ చూప‌నుంది. సినిమా నిర్మాణంలో ఉండ‌గానే స‌త్య‌రాజ్ క్ష‌మాప‌ణ‌లు చెబిత‌నే బాహుబ‌లి 2 క‌ర్ణాట‌క‌లో విడుద‌లవుతుంది.
అక్క‌డి ప్ర‌జా సంఘాలు తెలిపాయి. అయితే రాజ‌మౌళి తొమ్మిదేళ్ళ క్రితం స‌త్య‌రాజ్ చేసిన వ్యాఖ్యల‌వి, త‌ర్వాత స‌త్య‌రాజ్ న‌టించిన 30 సినిమాలు విడుద‌ల‌య్యాయి. అప్పుడు లేని స‌మ‌స్య ఇప్పుడెందుకు అని అన్నాడు. కార‌ణాలేవైనా కానీ క‌న్న‌డిగులు మాత్రం బాహుబ‌లి 2 విడుద‌ల రోజు ఏప్రిల్ 28న క‌ర్ణాట‌క బంద్‌కు పిలుపునిచ్చారు. మ‌రి రాజ‌మౌళి, క‌ర్ణాట‌క బాహుబ‌లి 2 డిస్ట్రిబ్యూట‌ర్ ఏం చేస్తారో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.