close
Choose your channels

సింగపూర్ సిరిమల్లి అంటున్న హంస...

Monday, February 20, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ హీరో రాజ్‌త‌రుణ్ హీరోగా ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యాన‌ర్‌పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను మార్చి 3న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు.

2016లో హిట్ అయిన చిత్రాల్లో `ఈడోర‌కం-ఆడోర‌కం` త‌ర్వాత ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ న‌టిస్తున్న మ‌రో చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త‌`. ఈ చిత్రం విడుద‌ల‌కు ముందు నుండి డిఫ‌రెంట్‌గా ప్ర‌మోష‌న్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఒక్కొక్క సాంగ్‌ను రిలీజ్ చేస్తూ వ‌స్తున్నారు. ఆల్బ‌మ్‌లో జానీ జానీ..అనే పాట‌ను రాజ్‌త‌రుణ్ రాయ‌డం కూడా విశేషం. ఈ సినిమాలో హంస నందిని ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింది. నా పేరే సింగపూర్ సిరి మ‌ల్లి...అంటూ సాగే ఈ పాట‌ను ఈరోజు సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.