close
Choose your channels

'జై లవకుశ' రిలీజ్ ఆలస్యం అవుతుంది...

Monday, April 24, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో హీరో నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై రూపొందిస్తున్న చిత్రం `జై ల‌వ‌కుశ‌`. శ్రీరామిన‌వ‌మి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఈ సినిమా టైటిల్ లోగో మోష‌న్ పోస్ట‌ర్‌కు ఆడియెన్స్ నుండి ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. గ‌త ఎన్టీఆర్ ఈ చిత్రంలో త్రిపాత్రాభిన‌యం చేస్తుండ‌గా నివేదా థామ‌స్‌, రాశిఖ‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

స‌మంత కూడా గెస్ట్ అప్పియ‌రెన్స్ చేసే అవ‌శాలున్నాయ‌ని టాక్ విన‌ప‌డుతుంది. ఈ సినిమాను ఆగ‌స్టులో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని ముందుకు అనుకున్నారు. కానీ తాజాగా మ‌హేష్, మురుగ‌దాస్ సినిమా వాయిదా ప‌డి ఆగ‌స్టు విడుద‌ల‌కు సిద్ధం కావ‌డంతో ఎన్టీఆర్ త‌న `జై ల‌వ‌కుశ‌` సినిమాను సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.