close
Choose your channels

రానా సినిమాను విడుద‌ల చేస్తున్న క‌ర‌ణ్‌ జోహార్

Tuesday, September 20, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

`బాహుబ‌లి ది బిగినింగ్` సినిమాను ద‌ర్మేంద్ర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై బాలీవుడ్‌లో విడుద‌ల చేసి తెలుగు సినిమా మార్కెట్‌కు హిందీలో మార్గం వేసుకునేలా దోహ‌ద‌ప‌డిన నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఇప్పుడు రానా ద‌గ్గుబాటి హీరోగా పివిపి బ్యాన‌ర్‌పై సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కిస్తున్న చిత్రం `ఘాజి`. 1971లో ఇండియా, పాకిస్థాన్ యుద్ధంలో ఇండియ‌న్ నేవీలో కీల‌క‌పాత్ర పోషించిన ఈ యుద్ధ‌నౌక స‌ముద్రంలోనే మునిగిపోయింది.

దాన్ని ఆధారంగా చేసుకుని భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేసేలా రూపొందిస్తున్నార‌ట‌. ఈ చిత్రాన్ని హిందీలో క‌ర‌ణ్ జోహార్ ఫ్యాన్సీ ఆఫ‌ర్‌తో ద‌క్కించుకోవ‌డం విశేషం. అల్రెడి రానాకు హిందీలో మంచి గుర్తింపు ఉంది, అలాగే తాప్సీ హీరోయిన్‌గా, కె.కె.మీన‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుండ‌టం వంటివి హిందీలో కూడా వ‌ర్క‌వుట్ అవుతాయ‌ని క‌ర‌ణ్ జోహార్ బ‌లంగా న‌మ్ముతున్నాడ‌ట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.