close
Choose your channels

19న తిరుప‌తిలో 'మ‌న‌లో ఒక‌డు' ఆడియో స‌క్సెస్ మీట్‌

Wednesday, September 14, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం మ‌న‌లో ఒక‌డు. ఈ చిత్రంలో నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా న‌టించారు. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.ఇటీవ‌ల రిలీజైన‌ ఈ చిత్రం ఆడియోకు చ‌క్క‌టి స్పంద‌న ల‌భిస్తుంది. ఈ సంద‌ర్భంగా ఈ నెల 19న తిరుప‌తి వేదిక‌గా ఆడియో స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.

ఈ సంద‌ర్భంగా ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ...మా చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం డీటీయ‌స్ మిక్సింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ నెల 19న తిరుప‌తిలో సంగీత విజ‌యోత్స‌వాన్ని నిర్వ‌హిస్తాం. మ‌న‌లో ఒక‌డు సినిమా మీడియా నేప‌థ్యంలో సాగుతుంది. కృష్ణ‌మూర్తి అనే సామాన్య అధ్యాప‌కుడి క‌థ ఇది. కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా అల్లుకున్నాం అని అన్నారు.

నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ...ప్ర‌స్తుత స‌మాజంలో మీడియా పాత్ర ఏంటో మ‌నందరికీ తెలుసు. అలాంటి మీడియా నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ఈ సినిమాను రూపొందించాం. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. అందుకే 19న తిరుప‌తిలో ఆడియో స‌క్సెస్ వేడుక‌ను నిర్వ‌హిస్తాం. ఈ నెలాఖ‌రున చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు.

సాయికుమార్‌, జెమిని సురేశ్ త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమాకు కెమెరామేన్: ఎస్‌.జె.సిద్ధార్థ్‌, స‌హ నిర్మాత‌లు: ఉమేశ్ గౌడ‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, క్రియేటివ్ హెడ్: గౌత‌మ్ ప‌ట్నాయ‌క్‌, పాట‌లు: చైత‌న్య ప్ర‌సాద్‌, వ‌న‌మాలి, పుల‌గం చిన్నారాయ‌ణ‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.