close
Choose your channels

మనోజ్ స్పీడ్ మీదున్నాడు

Sunday, October 11, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'శ్రీ' త‌రువాత క‌థానాయ‌కుడు మంచు మ‌నోజ్‌, ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. 'శౌర్య' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో రెజీనా క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమా సంబంధించిన షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంద‌ని స‌మాచారం.

ఇప్ప‌టికే 50 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింద‌ని ఇన్‌సైడ్ సోర్స్ చెప్పుకొస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు కుటుంబ నేప‌థ్యంలో సాగే చిత్రాల‌ను రూపొందించిన ద‌ర్శ‌కుడు ద‌శ‌ర‌థ్‌.. ఈ సినిమా కోసం త‌న శైలికి భిన్నంగా.. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లో సాగే క‌థ‌ని ఎంచుకున్నాడ‌ట‌. మ‌రి ఇందులో ఏ మేర‌కు వాస్త‌వ‌ముందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. 'మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్' త‌రువాత విజ‌యం లేని ద‌శ‌ర‌థ్‌కి.. అలాగే 'పోటుగాడు' త‌రువాత విజ‌యం లేని మ‌నోజ్‌కి ఈ సినిమా విజ‌యం కీల‌కంగా మారింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.