close
Choose your channels

తెలుగులో కంటే తమిళంలోనే క్రేజ్

Sunday, October 11, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

'ఊపిరి'.. నాగార్జున‌, కార్తీ, త‌మ‌న్నా కాంబినేష‌న్‌లో వ‌స్తున్న లేటెస్ట్ మూవీ ఇది. ఈ సినిమా త‌మిళంలోనూ 'తోళా' పేరుతో రూపొందుతోంది. దాదాపు చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈ డిసెంబ‌ర్‌లో కానీ.. వ‌చ్చే ఏడాది ఆరంభంలో కానీ.. రెండు భాషల్లో ఏక‌కాలంలో విడుద‌ల కానుంది. అయితే ఈ సినిమా తెలుగులో కంటే త‌మిళంలోనే ఎక్కువ క్రేజ్‌ని సంపాదించుకుంటుంద‌ని ఇన్‌సైడ్ సోర్స్ చెప్పుకొస్తోంది.

దానికీ ఓ రీజ‌న్ ఉంద‌ట‌. అదేమిటంటే.. ఇందులో జంట‌గా న‌టిస్తున్న కార్తీ, త‌మ‌న్నాల‌ది త‌మిళంలో ఇప్ప‌టికే రెండు విజ‌యాల‌ను చ‌విచూసిన జోడీ కావ‌డం. 'ప‌య్యా ' (తెలుగులో ఆవారా), 'సిరుత్తై' (తెలుగు విక్ర‌మార్కుడుకి రీమేక్‌)తో త‌మిళ‌నాట ఈ పెయిర్ కి ఫుల్ మార్క్స్ ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో 'తోళా' గా అక్క‌డి వారి ముందుకెళ్ల‌నున్న 'ఊపిరి'కి అక్క‌డే ఎక్కువ క్రేజ్ ఉంద‌న్న‌ది వారి మాట‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.