close
Choose your channels

సూపర్ స్టార్ చేతుల మీదుగా లారెన్స్ తల్లి విగ్రహవిష్కరణ....

Wednesday, February 22, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొరియోగ్రాఫ‌ర్‌, యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్ అయిన రాఘ‌వేంద్ర లారెన్స్‌, కేవ‌లం సినిమాల‌కే ప‌రిమితం కాకుండా పేద పిల్ల‌ల‌కు స‌హాయం చేస్తూ త‌న వంతుగా స‌మాజా సేవ‌లో భాగ‌మ‌య్యారు. అలాగే గురు రాఘ‌వేంద్ర‌స్వామి భ‌క్తుడైన లారెన్స్ రాఘ‌వేంద్ర స్వామి గుడిని కూడా క‌ట్టించాడు. ఈ గుడి ప్రాంగణంలో త‌న త‌ల్లి విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించ‌డానికి లారెన్స్ ప్లాన్ చేశారు. రాజ‌స్థాన్ నుండి తెప్పించిన పాల‌రాయితో ఐదు అడుగుల విగ్ర‌హాన్ని త‌యారు చేయించాడు లారెన్స్‌.

ఈ విగ్ర‌హాన్ని త‌మిళ సంవ‌త్స‌రాదిన ప్ర‌తిష్టించ‌డానికి సన్నాహాలు చేస్తున్నాడ‌ట‌. త‌ల్లిదండ్రుల‌ను ప‌ట్టించుకోని సంతానం ఉన్న ఈరోజుల్లో త‌ల్లి విగ్ర‌హం పెట్టే లారెన్స్ లాంటి కొడుకులు ఉండ‌టం గొప్ప విష‌య‌మే. మ‌రో విష‌య‌మేమంటే ఈ విగ్ర‌హాన్ని సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఆవిష్క‌రిస్తారు. రీసెంట్‌గా ర‌జ‌నీకాంత్‌ను క‌లిసిన లారెన్స్ ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేశాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.