close
Choose your channels

'ఎవడు' కి అదో సెంటిమెంట్ అట!

Monday, September 9, 2013 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎప్పుడో జులై 31 తేదికి రావాల్సిన రామ్ చరణ్, అల్లు అర్జున్ ల సినిమా ‘ఎవడు’.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల వాయిదాలు పడిన సంగతి విదితమే. అన్నీ కుదిరితే.. ఈ సినిమా విజయదశమి సందర్భంలో విడుదల కావచ్చు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడు. శ్రుతి హాసన్, ఎమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది.

ఇదిలా ఉంటే.. విడుదల విషయంలో జాప్యం జరుగుతున్నా.. ఈ సినిమా ఫలితం విషయంలో చిత్రయూనిట్ నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. ఆ నమ్మకానికి గల పలు కారణాల్లో ఒకటిగా.. జయసుధని చెప్పుకొస్తున్నారు. విషయమేమిటంటే.. దిల్ రాజు నిర్మించే సినిమాల్లో సహజ నటి జయసుధ కనిపిస్తే చాలు ఆ సినిమా కచ్చితంగా విజయం నమోదు చేసుకుంటుంది అనే సెంటిమెంట్ ఉంది.

‘బొమ్మరిల్లు’,’ పరుగు’, ‘కొత్త బంగారు లోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలు ఈ విషయాన్ని రుజువు చేస్తే.. తాజా సినిమా ‘ఎవడు’ కూడా అదే బాటలో పయనిస్తుందని వారు చెప్పుకొస్తున్నారు. చూద్దాం.. జయసుధ ఫ్యాక్టర్ ఎవడు ఫలితంలో ఎంతమేరకు సెంటిమెంట్ ని పండిస్తుందో!

Follow us on Google News and stay updated with the latest!