close
Choose your channels

'రేయ్'ని సెంటిమెంట్ తోనే..

Tuesday, December 3, 2013 • Tamil Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజని కథానాయకుడిగా పరిచయం చేస్తూ వై.వి.ఎస్. చౌదరి రూపొందిస్తున్న చిత్రం 'రేయ్'. సయామీ ఖేర్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమాలో శ్రద్ధాదాస్ మరో నాయికగా నటిస్తోంది. చక్రి సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావించినా. రామ్ చరణ్ నటించిన 'ఎవడు' సినిమా అదే సందర్భంలో రిలీజ్ కి రెడీ అవుతున్న సందర్భంగా విడుదల తేదిన ఫిబ్రవరి 5కి మార్చారు చౌదరి.

'రేయ్'ని ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చౌదరి చేస్తున్న ప్రయత్నం వెనుక ఓ సెంటిమెంట్ ఉందంటున్నారు పరిశీలకులు. అదేమిటంటే.. తన తొలి చిత్రం 'శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి' తరువాత చౌదరి తెరకెక్కించిన 'సీతారామరాజు' (నాగార్జున, హరికృష్ణ, సాక్షిశివానంద్ ప్రధాన పాత్రధారులు) 1999లో ఇదే ఫిబ్రవరి 5న విడుదలై చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో 'రేయ్'ని కూడా రిలీజ్ చేయాలని చౌదరి భావించడం వల్లే. ఈ తేది ఖరారయ్యిందని సమాచారం.

Follow us on Google News and stay updated with the latest!