close
Choose your channels

బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. మెదక్ నుంచి రఘునందన్ రావు పోటీ..

Thursday, March 14, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. మెదక్ నుంచి రఘునందన్ రావు పోటీ..

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ ప్రకటించింది. ఈ జాబితాలో 72 మంది అభ్యర్థులకు చోటు కల్పించింది. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ఖరారు చేయగా.. తాజా జాబితాలో మరో 6 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ స్థానాలను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. దాద్రా నగర్ హవేలి, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఇందులో స్థానం కల్పించారు.

ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గోడం నగేష్‌‌, మెదక్ నుంచి దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు అవకాశం దక్కింది. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి డీకే అరుణ పేరును ఖరారు చేశారు. మహబూబాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సీతారాం నాయక్ పోటీ చేయనున్నారు. ఇక నల్గొండ స్థానం నుంచి సైదిరెడ్డి.. పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చారు. ఇప్పటివరకు రెండు జాబితాలను పరిశీలిస్తే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకే ఎక్కువ సీట్లు కేటాయించడం గమనార్హం.

బీజేపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. మెదక్ నుంచి రఘునందన్ రావు పోటీ..

తాజా జాబితా పరిశీలిస్తే హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌ నుంచి కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, నాగ్‌పూర్‌ నుంచి కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, ముంబై నార్త్‌ నుంచి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, హవేరీ నుంచి కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై, బెంగళూరు సౌత్‌ నుంచి బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఇక ఇటీవల హర్యానా సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్‌కు లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. కర్నాల్ నియోజకవర్గం నుంచి ఖట్టర్‌ లోక్‌సభ బరిలో నిలిచారు. అలాగే ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్‌కు హర్‌ద్వార్ టికెట్ కేటాయించారు.

ఇదిలా ఉంటే తొలి జాబితాలో మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, హైదరాబాద్ నుంచి డాక్టర్ మాధవీలత, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూల్ నుంచి భరత్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్‌లకు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా తొలి జాబితాలో 195 మంది అభ్యర్థులను ప్రకటించగా.. రెండో జాబితాలో 72 మంది అభ్యర్థులతో కలిపి ఇప్పటివరకు మొత్తం 267 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.