close
Choose your channels

త‌రుణ్ భాస్క‌ర్ షాక్‌!!

Saturday, February 22, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌రుణ్ భాస్క‌ర్ షాక్‌!!

షార్ట్ ఫిలింస్ నుండి `పెళ్ళిచూపులు` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన త‌రుణ్ భాస్క‌ర్ తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని న‌మోదు చేసుకోవ‌డ‌మే కాదు.. రైట‌ర్‌గా కూడా జాతీయ అవార్డును కూడా దక్కించుకున్నాడు. దీంతో ఆయ‌న‌కు అవ‌కాశాలు వెల్లువెత్తాయి. ఆ త‌రుణంలో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌లో `ఈన‌గ‌రానికి ఏమైంది` అనే సినిమా చేశాడు. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా ఓకే అనిపించుకున్న‌ప్ప‌టికీ త‌రుణ్‌భాస్క‌ర్‌కు ఆశించిన స్థాయిలో స‌క్సెస్‌ను మాత్రం ఇవ్వ‌లేక‌పోయింది. దాంతో త‌రుణ్ భాస్క‌ర్ త‌దుప‌రి సినిమా ఎలా చేస్తాడోన‌ని సందేహాలు మొద‌ల‌య్యాయి. ఆ త‌రుణంలో త‌రుణ్ భాస్క‌ర్ హీరోగా ట‌ర్న్ ఇచ్చి అంద‌రికీ షాకిచ్చాడు.

విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌గా మారి చేసిన `మీకు మాత్ర‌మే చెప్తా` సినిమాలో హీరోగా న‌టించిన త‌రుణ్ భాస్క‌ర్‌కి ఆ సినిమా కూడా పెద్ద‌గా పేరు తెచ్చి పెట్ట‌లేదు. అదే స‌మ‌యంలో త‌రుణ్ భాస్క‌ర్ వెంక‌టేశ్‌తో సినిమా చేస్తాడ‌ని వార్త‌లు బాగా వినిపించాయి. ఈ త‌రుణంలో త‌రుణ్ భాస్క‌ర్ మ‌రోసారి అంద‌రికీ షాకిచ్చాడు. ఓ టీవీ షోను చేస్తున్నారు. ఓ ప్ర‌ముఖ ఛానెల్ ప్ర‌సారం చేయ‌బోయే ఈ షో 25వారాల పాటు ఉంటుంది. ఈ షో త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌వుతుంద‌ని త‌రుణ్ భాస్క‌ర్ త‌న ఇన్‌స్టా ద్వారా తెలియ‌జేశారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.