నటుడు బిక్రమ్‌జీత్ కన్వర్ పాల్ కరోనాతో మృతి

  • IndiaGlitz, [Saturday,May 01 2021]

యావత్ భారతదేశాన్ని కరోనా మహమ్మారి భయబ్రాంతులకు గురి చేస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గుతున్న దాఖలాలైతే కనిపించడం లేదు. కరోనా సెకండ్ వేవ్ ఇంత ప్రమాదకరంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కేసుల సంఖ్యే కాదు.. మరణాల సంఖ్య సైతం భారీగానే ఉండటం గమనార్హం. దేశంలో నాలుగు లక్షలకు పై చిలుకు కేసులు.. లెక్కకు అందని మరణాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఇక ప్రముఖ రాజకీయ నేతలు, సెలబ్రిటీలంతా కరోనా బారిన పడుతున్నారు. చాలా మంది ప్రముఖులు ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.

దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు.. నిన్న ఒక్కరోజే ఎన్నంటే..

తాజాగా బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటుడు బిక్రమ్‌జీత్‌ కన్వర్‌ పాల్(52) కరోనాతో కన్నుమూశారు. తొలుత రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌ అయిన బిక్రమ్‌ జీత్‌.. అనంతరం నటనను వృత్తిగా ఎంచుకున్నారు. 2003లో నటుడిగా బిక్రమ్ జీత్ తన జర్నీని ప్రారంభించారు. అప్పటి నుంచి పలు హిందీ చిత్రాలు, టీవీ సీరియల్స్‌, వెబ్‌ సిరీస్‌ల్లో నటుడిగా మెప్పించారు. బిక్రమ్‌జీత్‌ కన్వర్‌ పాల్ మృతిపై బాలీవుడ్‌ సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేశారు.

More News

దేశంలో రికార్డ్ స్థాయిలో కేసులు.. నిన్న ఒక్కరోజే ఎన్నంటే..

యావత్ భారతదేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోందే కానీ తగ్గుతున్న దాఖలాలైతే కనిపించడం లేదు.

కరోనాతో టాలీవుడ్ దర్శకుడి మృతి

క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ సెకండ్ వేవ్‌లో మ‌రింత వేగంగా విస్తరిస్తోంది. దేశంలో దాదాపు లక్షల్లో కేసులు..

ఈటలపై వేటుకు రంగం సిద్ధం.. సీబీఐతో విచారణ జరిపించాలన్న మంత్రి

ప్రభుత్వ ధిక్కార స్వరానికి త్వరలోనే వేటు పడబోతోందని తెలుస్తోంది. నిజానికి మంత్రులంటే ఎలా ఉండాలి? ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు,

అమెరికా సాయం భారత్‌కు చేరింది: యూఎస్ ఎంబసీ

ప్రస్తుతం భారత్‌లో హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో అత్యవసరమైన ఆక్సిజన్ కొరతతో పాటు టెస్టింగ్ కిట్లు, పీపీఈ కొట్ల కొరత దేశాన్ని కుదిపేస్తోంది.

మరో తమిళ రీమేక్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్..

2019లో ధనుష్ ప్రధాన పాత్రలో రూపొంది.. మంచి సక్సెస్ సాధించిన తమిళ చిత్రం 'రాక్షసన్‌'ను