నిహారిక పబ్‌లో వున్న మాట నిజమే .. కానీ : పుడింగ్ మింక్ పబ్‌ వ్యవహారంపై నాగబాబు స్పందన

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ఆవరణలోని పుడింగ్ మింక్ పబ్‌లో రేవ్ పార్టీ ఘటనలో పలువురు సెలబ్రెటీలు, సినీ ప్రముఖుల పిల్లలు పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బిగ్‌బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, సినీనటుడు నాగబాబు కుమార్తె నిహారిక అరెస్ట్ అయ్యారంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నాగబాబు స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు.

‘‘ గతరాత్రి బంజారాహిల్స్ రాడిసన్‌ బ్లూ పబ్‌లో జరిగిన సంఘటనపై నేను స్పందించటానికి కారణం.. నా కుమార్తె నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ సమయం ముగిసినా నడపటం వల్ల పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకూ అంతా క్లియర్‌. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్‌, మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాలో ఎలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వకూడదని నేను మీ ముందుకు వచ్చా. దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా’’అని నాగబాబు ఆ వీడియోలో వెల్లడించారు.

అంతకుముందు ఈ వ్యవహారానికి సంబంధించి సినీ నటి హేమ ఏకంగా బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గరకు వచ్చారు. తాను పబ్‌లో లేకపోయినా.. నా పేరు ఎందుకు బయటకు తెచ్చారంటూ పోలీసులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుతో తనకు సంబంధం లేకున్నా తన పేరును పలు ఛానళ్లలో ప్రసారం చేస్తున్నారని హేమ ఫైరయ్యారు. తన గురించి అవాస్తవాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు తెలిపారు. డ్రగ్స్ కేసు అనేది చిన్న విషయం కాదన్న ఆమె.. కొందరు కావాలనే తన పేరును ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు.

More News

బంజారాహిల్స్ రేవ్ పార్టీ.. ఆ పబ్‌లో గల్లా అశోక్ లేడు : గల్లా ఫ్యామిలీ స్టేట్‌మెంట్

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ మిగ్ పబ్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు జ‌రిపిన దాడిలో

ఆ పబ్‌లో నేను లేను..  నా పేరేందుకు లాగుతున్నారు, వారి పనే : పీఎస్ వద్ద హేమ రచ్చ రచ్చ

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్ ఆవరణలోని పుడింగ్ పబ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపుతోంది.

విడుదలకు సిద్ధమైన "నో రామా రావన్స్ ఓన్లీ" మూవీ

పసివయస్సులో గుండెలపై అయ్యే గాయాలు జీవితాంతం ఎలా వేధిస్తాయి" అనే సెంటిమెంట్ పాయింట్ తో సైకాలజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం "నో రామా రావన్స్ ఓన్లీ".

ఘోర రైలు ప్రమాదాన్ని తప్పించిన మహిళ.. చీర కొంగుతో వందల మందికి ప్రాణ భిక్ష

రైల్వే ట్రాక్‌పై నడుస్తుండగా పట్టా విరిగిపోవడమో, లేదంటే మరేదైనా కారణం వల్ల రైలు ప్రమాదంలో వుందని తెలిస్తే...

ఆర్ఆర్ఆర్‌కు సీక్వెల్ .. కన్ఫర్మ్ చేసిన విజయేంద్ర ప్రసాద్, అంతా ఓకే మరి ముగ్గురికీ డేట్స్ కుదిరేదెప్పుడు..?

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌ నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.