అప్పుడు 'క్ష‌ణం'... ఇప్పుడు 'కృష్ణ అండ్ హిస్ లీల‌'

  • IndiaGlitz, [Monday,August 26 2019]

'క్ష‌ణం' సినిమా పేరు చెప్ప‌గానే చాలా మందికి అడివి శేష్ పేరూ, అన‌సూయ పేరూ గుర్తుకొస్తుంది. ఆ త‌ర్వాతే ఆదా శ‌ర్మ గుర్తుకొస్తుంది. ఆఖ‌రిగా గుర్తుకొచ్చే పేరు ఆ సినిమా ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ పేరెపు. బిగుతైన స్క్రీన్‌ప్లేతో ర‌వికాంత్ పేరెపు తెర‌కెక్కించిన సినిమా'క్ష‌ణం'. ఆ చిత్రం త‌ర్వాత ర‌వికాంత్ పేరెపు నెక్స్ట సినిమా స్టార్ట్ చేశాడు కానీ, చాన్నాళ్లు ప‌ట్టింది షూటింగ్ కు. ఆ తాజా సినిమా గురించి ర‌వికాంత్ పేరెపు చెప్పుకొచ్చారు. ''నా తాజా సినిమాప ఏరు కృష్ణ అండ్ హిస్ లీలా. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు జొన్న‌లగ‌డ్డ హీరో. 'ర‌న్ రాజా ర‌న్‌' ఫేమ్ సీర‌త్ క‌పూర్ నాయిక‌గా న‌టించింది. ఇటీవ‌ల మా సినిమాలోని లాస్ట్ షాట్‌ను చిత్రీక‌రించాం. ల‌డ‌ఖ్‌లో చిత్ర క్రూ మొత్తం క‌లిసి చేసిన షాట్ అది. దాదాపు స‌ముద్ర‌మ‌ట్టానికి 17,582 అడుగుల ఎత్తులో మా ఫైన‌ల్ షాట్ పూర్తి చేశాం.

ల‌డ‌ఖ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఇప్పుడున్న టెన్ష‌న్ గురించి నేను ప్ర‌త్యేకంగా ఎవ‌రికీ చెప్ప‌క్క‌ర్లేదు. అయినా స్థానికులు చాలా మ‌ర్యాద‌గా మాతో ప్ర‌వ‌ర్తించారు. ఎంతో సుహృద్భావంతో మెలిగారు. వారి స‌హ‌కారాన్ని మ‌ర్చిపోలేను. ప్ర‌తిసినిమాకూ త‌న‌దైన ప్ర‌యాణం ఉంటుంది. ఈ సినిమా ప్ర‌యాణం నా గుండెల్లో నిలిచిపోతుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తాం'' అని అన్నారు. 'క్ష‌ణం' త‌ర్వాత ఆ చిత్ర ద‌ర్శ‌కుడు రెండు సినిమాలు పూర్తి చేశారు. అందులో ఒక‌టి గూఢ‌చారి, ఇంకొక‌టి మొన్న విడుద‌లైన ఎవ‌రు. కానీ ద‌ర్శ‌కుడు మాత్రం రెండో సినిమాలోనే ఉన్నారు. ఈ కృష్ణ అండ్ హిస్ లీల ఆయ‌న కెరీర్‌కు ఎలాంటి సినిమా అవుతుంది? అస‌లు తెలుగు సినిమాకు ఇంగ్లిష్ టైటిల్ ఎందుకు పెట్టిన‌ట్టు? వ‌ంటివ‌న్నీ ప్ర‌మోష‌న్ ఈవెంట్స్ లో చెబుతార‌ట‌.

More News

'మేజ‌ర్‌' కోసం శేష్ వ‌ర్క‌వుట్స్!

`మేజ‌ర్‌` చిత్రం కోసం అడివి శేష్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అందులో ప్ర‌ధాన‌మైన‌ది బ‌రువు త‌గ్గ‌డం.

హంస వాహిని టాకీస్ ఇట్లు మీ శ్రీమతి షూటింగ్ ప్రారంభం

హంస వాహిని టాకీస్ పతాకంపై ఎమ్. ఎస్.రెడ్డి నిర్మాణంలో మురళి బోడపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఇట్లు మీ శ్రీమతి".

డిజిక్విస్ట్ ఇండియా లిమిటెడ్ ఒక తెలుగు ప్రేమకథ చిత్రం ట్రైలర్ లాంచ్

ఇప్పుడున్న యువతకు, పిల్లలకు తెలుగు సరిగ్గ రావడం లేదు. వారంతా ఆంగ్లం మీద మోజుతో తల్లి లాంటి తెలుగును మర్చిపోతున్నారు.

‘ఎవరు’ ని అభినందించిన మహేశ్

మంచి సినిమాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ప్రశంసలు లభిస్తాయి. ఆగస్ట్ 15న విడులైన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎవరు’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యిది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా ‘ఎవరు’

కోర్టు సమస్యల్లో ప్రకాశ్‌రాజ్

హిందీ సహా దక్షిణాది భాషల్లో పలు వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదిచుకున్నాడు ప్రకాశ్‌రాజ్. తెలుగు, తమిళంలో దర్శకుడిగా ఉలవచారు బిర్యానీ అనే సినిమాను రూపొందించారు.