`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` సెన్సార్ పూర్తి.. జూన్ 21న విడుద‌ల‌

  • IndiaGlitz, [Sunday,June 02 2019]

న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌'. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను తెచ్చింది. ఈ చిత్రాన్ని జూన్ 21న విడుద‌ల చేస్తున్నారు.

స్వ‌రూప్ ఆర్‌.ఎస్‌.జె ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి అద్భుత‌మైన స్పంద‌న ల‌భించింది. న‌వీన్ ఈచిత్రంలో డిటెక్టివ్ పాత్ర‌ధారిగా న‌టించారు. సినిమా ఆసాంతం ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. స‌న్నీ కూర‌పాటి సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

డిఫ‌రెంట్ టేకింగ్‌, స్క్రీన్‌ప్లేతో సాగే కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది. మ‌ళ్ళీరావా చిత్రాన్ని అందించిన రాహుల్ యాద‌వ్ న‌క్కా ఈ చిత్రాన్ని స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిర్మించారు.

న‌టీన‌టులు: న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ త‌దిత‌రులు

More News

సఫల రాష్ట్రంగా తెలంగాణ.. పెన్షన్ దారులు, రైతన్నలకు కేసీఆర్ శుభవార్త..

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. జూన్-02 రాష్ట్రవ్యాప్తంగా అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.

ఫ్యాన్స్‌కు ఇఫ్తార్ విందు ఇచ్చిన బ‌న్ని

టాలీవుడ్‌లో న‌యా ట్రెండ్ స్టార్ట‌య్యింది. ఇంత‌కు ఆ ట్రెండ్ ఏంటో తెలుసా..ఇఫ్తార్ విందు. ప‌విత్ర రంజాన్ మాసం సంద‌ర్భంగా ముస్లిం సోద‌రుల‌కు ఇఫ్తార్ విందు ఇస్తుంటారు.

`ల‌క్ష్మీబాంబ్‌`లో రాఘ‌వ లారెన్స్ రీ జాయిన్‌

రాఘ‌వ లారెన్స్ రీసెంట్‌గా డైరెక్ట‌ర్‌గా బాలీవుడ్‌లోకి రంగ ప్ర‌వేశం చేసిన సంగ‌తి తెలిసిందే.

కీర్తి సురేష్ స‌రికొత్త లుక్ చూశారా?

అప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన కీర్తిసురేష్‌.. `మ‌హాన‌టి` త‌ర్వాత న‌టిగా కొత్త అవ‌తారం ఎత్తారు.

టీడీపీ ఉద్ధండులు సంచలన నిర్ణయం.. త్వరలో బీజేపీలోకి!!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి.