బాలీవుడ్ రీమేక్లో అజిత్...
- IndiaGlitz, [Thursday,August 16 2018]
కమర్షియల్ హీరోగా పేరున్న తమిళ స్టార్ హీరో అజిత్ తదుపరి ఓ బాలీవుడ్ రీమేక్లో నటించబోతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం అజిత్... శివ కాంబినేషన్లో 'విశ్వాసమ్' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు.
ఇది బాలీవుడ్లో విజయవంతమైన పింక్ సినిమాకు రీమేక్ అని సమాచారం. తాప్సీ, అమితాబ్ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించారు. తమిళ రీమేక్లో అమితాబ్ పాత్రలో అజిత్ కనపడబోతున్నారు. తాప్సీ పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా ఓ క్లారిటీ రాలేదు. 'ఖా'కి సినిమా తర్వాత వినోద్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రమిదే.