‘అజిత్’ చనిపోతూ ఆరుగురిని బతికించాడు!

  • IndiaGlitz, [Tuesday,May 21 2019]

'అజిత్' అనే యువకుడు చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోశాడు. మే-15న హైదరాబాద్‌లో అజిత్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా హైటెక్ సిటీ వద్ద వాటర్ ట్యాంక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అజిత్ రెడ్డి తలకు తీవ్రగాయమైంది. అత్యవసర చికిత్సకై స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు.

అయితే ఎక్కువగా బ్లీడింగ్ కావడంతో బ్రెయిన్ డెడ్ అయ్యిందని నిర్ధారించారు. దీంతో అవయవదానం కోసం వైద్యులు జీవన్‌దాన్ ప్రతినిధులతో కుటుంబ సభ్యులకు వివరించారు. అవయవదానం విశిష్టతను వారికి వివరించగా.. కుటుంబీకులు అందుకు అంగీకరించారు.

ఈ మేరకు జిత్ రెడ్డి శరీరం నుంచి కాలేయం, గుండె, రెండు మూత్రపిండాలు, కార్నియాలు సేకరించారు. అజిత్ రెడ్డి అవయవదానంతో ఆరుగురికి జీవనదానం లభించిందని వైద్యులు కుటుంబ సభ్యులను అభినందించారు. రోడ్డు ప్రమాదంలో మృత్యు కబళించినా ఆయన అవయవాలు ఆరుగురి జీవితాలను నిలబెట్టాయన్న మాట. అజిత్ మరణించినా ఆ ఆరుగురిలో జీవించే ఉన్నారు. హైటెక్ సిటీలో నివాసం ఉండే మెట్టు అజిత్‌రెడ్డి అమేజాన్ సంస్థలో పనిచేస్తున్నాడు.

More News

మీకు ఎగ్జిట్ పోల్స్.. మాకు ఎగ్జాట్ పోల్స్‌తో సంబరాలు!

అమరావతిని భ్రమరావతి అన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ఎలా గెలుస్తారు? అని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలపై దేవినేని మాట్లాడుతూ..

బ‌న్నీతో 'రొమాంటిక్' భామ‌

అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ చిత్రం రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. నాన్న నేను, పార్థు అనే టైటిల్స్ ప‌రిశీల‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

ట్వీట్ డిలీజ్ చేసి సారీ చెప్పిన వివేక్ ఒబెరాయ్‌

సోమ‌వారం ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాను, న‌టి ఐశ్వ‌ర్యారాయ్ వ్య‌క్తిగ‌త జీవింతో పోల్చుతూ ఎవ‌రో పోస్ట్ చేసిన మీమ్‌ను వివేక్ ఒబెరాయ్ పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. వివేక్ చ‌ర్య‌ను అంద‌రూ త‌ప్పుప‌ట్టారు.

'సాహో' లుక్ విడుద‌ల చేసిన ప్ర‌భాస్‌

అంద‌రూ ఎదురు చూసిన‌ట్లుగానే ప్ర‌భాస్ త‌న `సాహో` చిత్రానికి సంబంధించిన లుక్‌ను విడుద‌ల చేశారు. సోమ‌వారం త‌న సినిమాకు సంబంధించి ఓ స‌ర్‌ప్రైజ్ ఇస్తాన‌ని ప్ర‌భాస్ తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

'సీత‌' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన చిత్రం చిత్రం ‘సీత’. మన్నారా చోప్రా మరోనాయిక. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం నిర్మించారు