మ‌రింత‌ క్లారిటీ ఇచ్చిన అఖిల్‌

  • IndiaGlitz, [Wednesday,November 28 2018]

అక్కినేని అఖిల్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మిస్టర్‌ మజ్ను'. ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

కాగా.. నేడు ట్విట్ట‌ర్ వేదిక అఖిల్ మిస్ట‌ర్ మ‌జ్నుపై క్లారిటీ ఇచ్చాడు. ప్ర‌స్తుతం ప్యాచ్ వ‌ర్క్ జ‌రుగుతుంది. డిసెంబ‌ర్ 3 నాటికి ప్యాచ్ వ‌ర్క్ కంప్లీట్ అవుతుంది. ఒక సెట్ సాంగ్ మిన‌హా షూటింగ్ అంతా పూర్త‌వుతుంది.

జ‌న‌వ‌రిలో సినిమాను విడుద‌ల చేస్తాం. ఓపిక‌గా వెయిట్ చేస్తున్న అభిమానుల‌కు థాంక్స్‌ అంటూ మెసేజ్ పోస్ట్ చేశాడు అఖిల్‌. అఖిల్‌ సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

More News

విజ‌య‌వాడ అమ్మాయిని హీరోయిన్ చేస్తున్న శేఖ‌ర్ క‌మ్ముల‌

'ఫిదా' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్టార్ డైరెక్టర్ శేఖర్ క‌మ్ముల చేయ‌బోయే కొత్త సినిమా మొదలైంది.

రామ్‌చ‌ర‌ణ్‌తో క్యాథ‌రిన్ స్పెష‌ల్

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతో్న చిత్రం 'విన‌య విధేయ రామ‌'.

'జీరో' శ్రీదేవి అతిథి పాత్ర‌

అల‌నాటి అందాల తార శ్రీదేవి ఆక‌స్మాత్ముగా క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఈమె మ‌ర‌ణానికి ముందు షారూక్‌ఖాన్ ప్ర‌స్తుత చిత్రం `జీరో`లో అతిథి పాత్ర‌లో న‌టించింద‌ని వార్త‌లు వినిపించినా..

షాకిచ్చిన వ‌ర్మ‌

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ వ‌ర్మ త‌న సినిమా ప‌బ్లిసిటీ కోసం ఏదైనా చేస్తుంటాడు. ప్ర‌స్తుతం ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లో ధ‌నంజ‌య్‌, ఐరా మోర్ హీరో హీరో్యిన్‌గా సిద్ధార్థ తాతోలు ద‌ర్శ‌క‌త్వంలో

'2.0' తో షారూక్ సినిమాను చంపేస్తున్నారా?

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్, శంక‌ర్‌, అక్ష‌య్‌కుమార్ కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ `2.0`. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా న‌వంబ‌ర్ 29న విడుద‌ల‌వుతుంది.