షూటింగ్ లో గాయపడ్డ అఖిల్

  • IndiaGlitz, [Thursday,March 05 2020]

అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’. గ‌త కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ చెన్నైలోజ‌రుగుతుంది. ఈ షూటింగ్‌లో అఖిల్ గాయ‌ప‌డ్డాడ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. విన‌ప‌డుతున్న స‌మాచారం మేర‌కు చెన్నైలో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తుండ‌గా అఖిల్ జారిప‌డ్డాడ‌ని ఫ‌లితంగా మోచేయి భాగం బాగా వాచింద‌ని దీంతో సినిమా షూటింగ్ నాలుగు రోజుల పాటు ఆగింద‌ని టాక్‌. మ‌రి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాస్‌, వాసు వ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. సినిమా చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఏప్రిల్‌లో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని ముందుగా చిత్ర యూనిట్ భావించిన‌ప్ప‌టికీ తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాను మే నెల‌లోనే విడుద‌ల చేయాల‌ని అన‌కుంటున్నార‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఇదే నెల‌లో అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి లవ్‌స్టోరి కూడా విడుద‌ల కానుంది. గ‌త మూడు చిత్రాలు ఆశించిన స్థాయిలో విజ‌యాలు సాధించ‌క‌పోవ‌డంతో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌పై చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు.

More News

ప‌వ‌న్ 27 లేటెస్ట్ అప్‌డేట్‌

రాజ‌కీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ ముందుకెళుతున్నారు.

సూప‌ర్‌స్టార్‌కి విల‌న్‌గా మారుతున్న టాలీవుడ్ హీరో

సూప‌ర్‌స్టార్ ర‌జినీ కాంత్ తాజా చిత్రం ‘అణ్ణాత్త‌’. డైరెక్ట‌ర్ శివ ద‌ర్శ‌క‌త్వంలో స‌న్‌పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సినిమా తెర‌కెక్కుతోంది.

ఎన్టీఆర్ 30పై వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అవాస్త‌వం!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి చిత్రం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో

రాజ్యసభకు చిరు.. క్లారిటీ ఇచ్చేసిన నాగబాబు!

మెగాస్టార్ చిరంజీవికి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంపరాఫర్ ఇవ్వాలని భావిస్తు్న్నాడని..

ఫలిస్తున్న జగన్ ప్రయత్నాలు.. కడపకు భారీ ప్రాజెక్ట్!

ఏపీకి పెట్టుబడులను ఆహ్వానించేందుకు వైఎస్ జగన్ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఓవైపు గత ప్రభుత్వం దెబ్బిపొడుస్తుంటే..