ఆహా కోసం అర‌వింద్ గ‌ట్టి ప్ర‌య‌త్నాలు..!

ఓటీటీ మాధ్య‌మాలు జోరును ముందుగానే ఊహించిన తెలుగు నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ ఒక‌రు. అందుక‌నే ఆయ‌న తెలుగులో ఆహా అనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేసి తీసుకొచ్చారు. ఇందులో చాలా మందిని పార్ట‌న‌ర్స్‌గా చేర్చుకున్నారు. ఆహా కంటెంట్‌లో ద‌ర్శ‌కుడు క్రిష్ కీల‌క భూమిక పోషిస్తున్నాడు. అయితే అర‌వింద్ ఆశించిన స్థాయి కంటే ఎక్కువ రెస్పాన్స్ రావ‌డం లేద‌ట. దీంతో సినిమా రంగానికి చెందిన ప‌లువురు ద‌ర్శ‌కులను కంటెంట్ క‌న్‌స‌ల్‌టెంట్స్‌గా ఉప‌యోగించుకోవాల‌ని అర‌వింద్ ప్లాన్స్ చేస్తున్నాడు.

తాజా స‌మాచారం మేర‌కు సినిమా రంగంలో కొంత మంది ద‌ర్శ‌కుల‌తో ఇప్ప‌టికే అల్లు అర‌వింద్ చ‌ర్చ‌లు జ‌రిపారని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వీరిలో వంశీ పైడిప‌ల్లి, చంద్ర‌సిద్ధార్థ్‌, నందినీరెడ్డి, విఐ.ఆనంద్‌ల‌ను కంటెంట్ క‌న్‌స‌ల్‌టెంట్స్‌గా నియ‌మించుకున్నార‌ట‌. వీరంద‌రూ ఇప్ప‌టికే త‌మ సర్కిల్‌లోని త‌మ‌కు తెలిసి మంచి కంటెంట్ అందించే ర‌చ‌యిత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. తెలుగు సినిమా రంగానికి చెందిన మ‌రికొంత మంది నిర్మాతలు కూడా ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టాల‌ని స‌న్నాహాలు చేసుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో వీలైనంత మంది తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న ఓటీటీ స‌బ్‌స్క్రైబ‌ర్స్‌గా చేసుకోవాల‌ని అర‌వింద్ త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

 
 

More News

నిర్మాత‌ల‌కు గుడ్‌న్యూస్‌... ఆన్ లైన్ సెన్సార్

క‌రోనా ప్ర‌భావంతో త‌ల్ల‌డిల్లుతోన్న సినిమా ప‌రిశ్ర‌మ‌కు ఓ చిన్న ఊర‌ట దొరికింది. అదేంంటే జాతీయ సెన్సార్ బోర్డు సినిమాల‌కు ఆన్‌లైన్‌లో సెన్సార్ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డ‌మే.

చిరంజీవిని డైరెక్ట్ చేయాలనుకుంటున్న డైరెక్టర్!!

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వ‌రుస సినిమాల‌ను చేస్తూ పోతున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న యువ ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు.

బండ్ల గణేష్ వర్సెస్ హరీష్.. ముదురుతున్న వివాదం!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ హీరోగా వచ్చిన ‘గబ్బర్ సింగ్‌’ సినిమా ఇటీవలే ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న విషయం విదితమే. ఈ సందర్భంగా సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్..

సబ్ కలెక్టర్‌గా పవన్ వీరాభిమాని.. ఫ్యాన్స్‌లో జోష్!

టాలీవుడ్‌లో పవర్ స్టార్.. రాజకీయాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. పవన్ అనే పేరు వింటే చాలు అభిమానులకు ఒక తెలియని ఉత్సాహం కలుగుతుంది.

అమెజాన్ ప్రైమ్ లో నేరుగా రిలీజ్ అవుతున్న కీర్తి సురేశ్ 'పెంగ్విన్'

మ‌హాన‌టి సినిమాతో ఎంత‌గానో పేరు ప్ర‌ఖ్యాత‌లు ద‌క్కించుకొని, తెలుగు ప్రేక్షకుల‌కి అత్యంత‌గా చేరువైన న‌టి కీర్తి సురేశ్. ఇటీవ‌లే నేష‌న‌ల్ అవార్డ్ ని కూడా కైవ‌సం చేసుకున్నారు. మ‌హాన‌టి